రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో రైల్వే పోలీసులు సదరు వ్యక్తి ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారని గుర్తించారు. దీంతో అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్న్నాడని కేసును ఛేదిస్తున్న క్రమంలో పోలీసులు షాక్ అయ్యారు. బ్యాంకు అధికారి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడితే.. ఆయన భార్య హత్యోదంతం వెలుగు చూడటంతో కలకలం రేగింది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని నల్లకుంట పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన మాధవ్ (30)కు, అదే జిల్లాకు చెందిన సుమలత (25)తో గత సంవత్సరం వివాహమైంది.
నల్లకుంట సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే మాధవ్ కు, సుమలతకు గత ఏడాది వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొన్నాళ్లు సవ్యంగానే సాగిన వీరి సంపారంలో.. అనుమానం పెనుభూతమయ్యింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న మాధవ్, ఈ నెల 21న విద్యానగర్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాధవ్ మృతి తరువాత సుమలత అదృశ్యం కావడంతో, ఆత్మహత్య వెనుక సుమలత ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ క్రమంలో కుమార్తె సుమలత జాడ తెలియని ఆమె తల్లిదండ్రులు నల్లకుంటలోని ఇంటికి వచ్చారు. తాళం వేసున్న ఇంటిని పగులగొడదామని ఇంటి యజమానికి చెప్పడంతో, ఆయన వారించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చిన తరువాత తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, మంచంపై సుమలత మృతదేహం కనిపించింది. గొంతుకు చున్నీతో ఉరేసి, ఆపై దిండు ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త, ఇంటికి తాళం వేసి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న పోలీసులు, కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more