Kumaraswamy bans mobile phones by officials కర్నాటక సీఎం తాజా నిర్ణయం.. ప్రధాని మోడీ బాటలో..

Kumaraswamy bans mobile phones during official meetings

State governments of India, Karnataka Legislature, Government of India, H. D. Kumaraswamy, Mobile phone, Kumaraswamy, Shiva kumar, siddaramaiah, social media sites, Karnataka Chief Minister, chief minister, cell phones, Narendra Modi, mobile phones

Karnataka Chief Minister H. D. Kumaraswamy wants to follow the footsteps of PM Modi in one Mobile Phone issue. He directed all officials and government staff to not use mobile phones during his meetings to avoid distraction.

కర్నాటక సీఎం తాజా నిర్ణయం.. ప్రధాని మోడీ బాటలో..

Posted: 06/02/2018 06:08 PM IST
Kumaraswamy bans mobile phones during official meetings

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అడుగుజాడల్లోనే పయనించాలని నిర్ణయించుకున్నారు. అదేంటి.. కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన ప్రభుత్వం.. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను తీవ్రంగా అక్షేపించిన జేడీఎస్ పార్టీ ఎలా విషయంలో ప్రధాని బాటలో పయనించాలని భావిస్తుందని అలోచిస్తున్నారా.? అంత అందోళన పడాల్సిన అవసరం లేదండీ. ఎందుకంటే కాంగ్రెస్-జేడీఎస్ పోత్తుకు ఎలాంటి విఘాతం కలగలేదు.

అయితే అధికారిక సమావేశాల సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ప్రధాని మోదీ తరహాలోనే తన సమావేశాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మీటింగ్ జరుగుతున్నప్పుడు కొందరు అధికారులు సెల్‌పోన్లు చూస్తున్నారనీ.. దీని వల్ల ముఖ్యమైన విషయాలపై చర్చలకు ఇబ్బంది కలుగుతోందని కుమరస్వామి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇకపై తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులు తమవెంట మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదని సీఎం సూచించారు. మీటింగ్ ముగిసే వరకు వాటిని కోఆర్డీనేషన్ అధికారికి అప్పగించాలన్నారు. కాగా తన సమావేశాలకు అధికారులు మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించినట్టు  ప్రధాని మోదీ  పేర్కొన్న కొద్ది రోజులకే కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సమావేశాల మధ్యలో అధికారులు తరచూ సోషల్ మీడియా సైట్లను చెక్ చేసుకుంటూ కనిపించడంతో... మోదీ సమావేశాల్లో  ఉన్నతాధికారులు సెల్‌ఫోన్లను వాడడంపై నిషేధం విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HD Kumaraswamy  karnataka cm  mobile phones  Prime Minister Narendra Modi  officials  meetings  

Other Articles