భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాయాది పాకిస్థాన్ అనేక పర్యాయాలు భారత సరిహద్దులో యథేచ్ఛగా కాల్పులకు పాల్పడుతూ.. ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే వుంది. సరిహద్దు వెంబడి ప్రతీ రోజూ కాల్పులకు దిగుతూ పౌరులు, సైనికుల ప్రాణాలను బలిగొంటోంది. భారత భూభాగంలోకి తాము పెంచిపోషించిన ఉగ్రవాదుల్ని అక్రమంగా పంపుతూనే వుంది. పాకిస్థాన్ కాల్పులను అనునిత్యం ధీటుగా ఎదుర్కోంటున్న భారత జవాన్లు., అప్పడప్పుడు మాత్రం వాటి దొంగదెబ్బకు బలవుతూనే వున్నారు. అనేక మంది స్థానిక పౌరులు కూడా ఈ కాల్పులలో అసువులు బాస్తున్నారు. ఇంకానేక మంది గాయాలపాలవుతూనే వున్నారు. సరిహద్దు ప్రాంతాలవారు తమ ఇళ్లను కూడా వదిలి ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో రంజాన్ మాసం సందర్భంగా సరిహద్దు కాల్పుల విరమణ చేయాలని ఇప్పటికే కేంద్రం అదేశించిన క్రమంలో పాకిస్థాన్ నుంచి కూడా సానుకూలత లభించింది. మంగళవారం ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరళ్లు (డీజీఎంవో) హాట్ లైన్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 2003లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై ఈ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిజాయతీగా చర్యలు తీసుకోవాలని,
సరిహద్దులోని ప్రజలకు ఎటువంటి అపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. నియంత్రణ రేఖ, వర్కింగ్ బౌండరీ వెంబడి పరిస్థితులపై సమీక్షించారు. సమస్యలు వస్తే స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగులు ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కరించుకోవాలని, అలాగే హాట్ లైన్ ద్వారా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల డీజీఎంవోల మధ్య హాట్ లైన్ ద్వారా జరిగిన చర్చల విషయాన్ని భారత సైన్యం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇదిలావుండగా, రంజాన్ తరువాత కుక్కతోక బుద్దితో వ్యవహరించే పాకిస్థాన్ ఈ నిర్ణయానికి కట్టబుడి వుంటుందా..? లేక గతంలో మాదిరిగానే మాట తప్పుతుందా.? అన్నది కాలమే తేల్చాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more