కర్ణాటకలో కమల పార్టీ వ్యూహాలకు అంతుచిక్కని విధంగా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పై ఎత్తులు వేస్తుంది. విశ్వాస పరీక్షలో నెగ్గడమే లక్ష్యంగా ఆపరేషన్ కమల్ కు కాషాయ పార్టీ తెరలేపిగా.. బీజేపీ వేసే ఎరలో తమ ఎమ్మెల్యేలను పావులుగా మారకుండా.. కాంగ్రెస్-JDS తమ ఎమ్మెల్యేలను కర్ణాటక రాష్ట్రం నుంచి పోరుగురాష్ట్రాలకు తరలిస్తుంది. కమలం పార్టీ బలపరీక్షలో అపజయం పాలైతే కానీ తమకు గవర్నర్ వాజుభాయ్ వాలా నుంచి పిలుపు రాదని భావిస్తున్న పార్టీలు.. ఆ మేరకు బీజేపి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తమ ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
కర్ణాటక గవర్నర్ యడ్యూరప్ప ప్రభుత్వానికి పక్షం రోజుల వ్యవధిని ఇచ్చి బలనిరూపణ చేసుకోవాల్సిందిగా అవకాశం ఇవ్వడంతో.. ఈ సమయం చాల ఎక్కువని భావించిన పార్టీలు ఈ పక్షం రోజుల పాటు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు బీజేపికి మద్దతు పలికితే యడ్యూరప్ప ప్రభుత్వం రెండున్నరేళ్ల వరకు బతికి బట్టకట్టే అవకాశాలు వున్నందున్న.. ఆ అవకాశం వారికి కల్పించకుండా కట్టుదిట్టమైన చర్యలకు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా క్రితం రోజు ఎమ్మెల్యేలను కోచ్చికి తరలించాలని ముందుగా భావించిన కాంగ్రెస్.. జేడీఎస్ ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేలను కొచ్చి తరలించేందుకు రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. కొచ్చిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఎమ్మెల్యేలుండేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు స్పెషల్ ఫ్లైట్ లను కూడా బుక్ చేశాయి. ఎమ్మెల్యేలంతా బస్సుల్లో ఎయిర్ పోర్ట్ కు వెళ్లగా… విమానాలు బయల్దేరేందుకు డీజీసీఏ అనుమతించలేదు. దీంతో అందరినీ రోడ్డు మార్గంలోనే వేరే ప్రాంతానికి తరలించారు. పుదుచ్చేరి, కొచ్చి అని ముందు చెప్పినా… చివరకు వారిని అర్థరాత్రి హైదరాబాద్ తరలించారు. రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడి ట్రావెల్స్ బస్సులోకి ఎమ్మెల్యేలను మార్చారు.
#WATCH Congress MLAs changing buses on #Hyderabad Highway. The MLAs along with JD(S) MLAs will be staying in Hyderabad #KarnatakaElections2018 pic.twitter.com/eUk3dFd4yq
— ANI (@ANI) May 17, 2018
ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరినట్టు తెలుస్తోంది. హోస్పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్… కనిపించకుండా పోయారు. వ్యక్తిగత పనులపై ఆయన ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్, గాలి జనార్ధన్ రెడ్డిలకు ఆయన అత్యంత ఆప్తుడు. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వంలోనే మంత్రిగానూ పనిచేశారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వెళ్లారనే భావన వ్యక్తమవుతోంది. ఇక మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ కూడా రిసార్ట్ కు తిరిగిరాలేదు.
ఆరోగ్యం బాగాలేదని రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులో లేకుండా పోయారు. వీళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరి లతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకర్ రెడ్డి, కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపార్టీ ఎమ్మెల్యే R.శంకర్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగేశ్ లను ఆకర్షించే ప్రయత్నాల్లో కషాయదళం నిమగ్నమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more