తమ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమ మార్గాల్లో బీజేపి.. తమ వైపు తిప్పుకునేందుకు అనైతిక చర్యలకు పాల్పడుతోందని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. రూ.100 కోట్ల ఆఫర్ తోపాటు కొంతమంది జేడీఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇస్తామంటూ ప్రలోబాలకు పాల్పడుతున్నారని కుమారస్వామి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేకపోయినా నరేంద్రమోదీ కర్ణాటకలో అధికారం చేపాడతాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపి కర్ణాటకలో మత విద్వేషాలు రెచ్చగొట్టినందువల్లే 104 స్థానాలు గెలుపొందిందని కుమారస్వామి ఆరోపించారు.
బెంగళూరులో జరిగిన జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కుమారస్వామిని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన తన సోదరుడు హెచ్డీ రేవణ్ణతో కలిసి మాట్లాడారు. కర్ణాటకలో జేడీఎస్ ను అంతమొందించాలన్నదే బీజేపి లక్ష్యమని ఆరోపించారు. రాష్ట్రంలో లౌకికవాదం నెలకొనాలనే కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 104 స్థానాలు గెలుచుకున్న బీజేపికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేనందువల్లే తాము కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు.
ఈ పొత్తు ఎన్నికల ఫలితాల తర్వాత కుదిరిందే తప్ప.. ఎన్నికల ముందు నిర్ణయించింది కాదని స్పష్టం చేశారు. తనకు అధికార దాహం లేదని.. ముఖ్యమంత్రి కావాలన్న కోరికా లేదని.. కేవలం రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ తో పనిచేయాలని అనుకున్నామన్నారు. ఇక అధికారానికి అమడ దూరంలో నిలిచిన బీజేపి మాత్రం తాము అధికారపీఠం అధిరోహించి తీరుతామని ధీమా వ్యక్తం చేయడం అనైతిక చర్యలకు పాల్పడతామని స్వయంగా ప్రకటించుకోవడమేనని చెప్పారు. ఈ క్రమంలో జేడీఎస్లో చీలిక వస్తుందని కూడా బీజేపి ప్రచారం చేసిందని ఆయన దుయ్యబట్టారు.
అంతకుముందే మాట్లాడిన హెచ్ డీ రేవణ్ణ తన సోదరుడితో తనకు విభేధాలు వచ్చాయన్న వార్తలను ఖండించారు. జేడీఎస్ శాసన సభాపక్షనేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని, తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని స్పష్టం చేశారు. జేడీఎస్ నుంచి చీలతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more