pawan kalyan moves deeply on boat capsize లాంచీ ప్రమాద ఘటనతో నా గుండె బరువెక్కింది: పవన్

Pawan kalyan moves deeply on boat capsize in east godavari

pawan kalyan, janasena, Pawan Kalyan boat capsize, pawan kalyan press note, pawan on east godavari tragedy, Pawan Fans, Janasena Party, Pawan Kalyan Shettipally Road Show, Pawan Kalyan Latest News, Pawan Kalyan, Pawan Kalyan New Pics, JanaSena Party, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan moves deeply on boat capsize in east godavari, slams past governments for allowing unauthorised boats into river

లాంచీ ప్రమాద ఘటనతో నా గుండె బరువెక్కింది: పవన్

Posted: 05/16/2018 07:54 PM IST
Pawan kalyan moves deeply on boat capsize in east godavari

గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటన తెలియగానే తన గుండె బరువెక్కిందని జనసేన అధినేత, వపర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించిందని తాజాగా ఆయన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ లో పేర్కోన్నారు. "60 అడుగుల లోతున లాంచీ పడిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైందని అన్నారు. మృతుల కుటుంబాలకి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకి శాపం కావద్దు. ఈ ఘటనలో సర్కార్ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సక్రమంగా లేవంటే... లోపం ఎవరిది? జవాబుదారీతనం లేని పాలన విధానాలే అమాయకుల్ని జలసమాధి చేశాయి. దుర్ఘటన జరగగానే హడావిడి చేసే పాలకులు.. సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపించాలి. ప్రజల వద్దకు పాలన ప్రకటనలకే పరిమితమా? నిత్యావసరాలకి, వైద్యం, విద్య కోసం, ఏ చిన్న పని ఉన్నా నదిలోనే ప్రయాణాలు సాగిస్తూ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వ శాఖలు గిరిజన గూడేలపై శ్రద్ధ చూపడం లేదు. పోలవరం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరిగి వెళుతూ ఈ ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజనులకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వారి గూడేలకి చేర్చాలి. నదుల్లో అనుమతులు లేని బోట్లు తిరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణా నదిలో బోటు ప్రమాద ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం" అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  east godavari  boat capsize  andhra pradesh  politics  

Other Articles