కర్ణాటకలోని హుబ్బళి విమానాశ్రయంలో తాను తన కాంగ్రెస్ నేతల టీమ్ తో ప్రయాణిస్తున్న క్రమంలో సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండైన ఘటనను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆది భయానక ఘటనగా అభివర్ణించారు. తాను ఆ విమానంలో వుండటంతో.. అందరితో పాటు తాను కూడా భయాందోళన చెందనాని, ఇక తన పని అయిపోయిందని అనుకున్నానని అన్నారు. విమానంలోని ప్రయాణికులు అందరూ భయంతో గుండెలు అరచేతిలో పెట్టుకుంటే రాహుల్ మాత్రం నిబ్బరంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు, రాహుల్ ఎస్ రవి, విద్యార్థి తదితరులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
స్వతహాగా ఒక పైలెట్ అయిన రాహుల్ క్రూ క్యాబిన్ లోకి వెళ్లి పైలెట్లకు విమానాన్ని సురక్షింతంగా దిందచడంలో సాయపడ్డారని కూడా ట్విట్ లో పేర్కోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన జనాక్రోశ్ సభలో రాహుల్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక తన పని అయిపోయిందని అనుకున్నానని తెలిపారు. అప్పుడే తనకు మానస సరోవర్ లోని శివాలయాన్ని దర్శించాలని మొక్కుకున్నానని రాహుల్ చెప్పారు.
తాను ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 8 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు జారడంతో విమానం క్రాష్ అవుతుందని.. ఇక అంతా అయిపోయింది అని కూడా అనుకున్నానని పేర్కొన్నారు. ఆ సమయంలో భగవంతుడిని స్మరించుకున్నానని, కైలాస్ మానస సరోవర్ను సందర్శిస్తానని కూడా మొక్కుకున్నానని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో కర్ణాటక ఎన్నికలు ఈ నెల 12న జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికలు ముగిసిన తరువాత.. మానస సరోవర్ లోని కైలాష్ నాథ్ అలయ సందర్శనకు వెళ్తానన్నారు. అందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు తనకు 15 రోజుల సెలవును ఇవ్వాలని అనుమతి కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more