అవినీతి రహిత భారత నిర్మాణం కోసం కంకణబద్దుడై నిరాహార దీక్షకు పూనుకున్న సామాజిక కార్యకర్త అన్నాహాజరే.. సమర్థవంతమైన లోక్ పాల్ చట్టంతో పాటు, రాష్ట్రాలలో లోకాయుక్త బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హస్తినలోని రాంలీలా మైదనాంలో దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. అయితే అన్నా దీక్షకు కేవలం రాష్ట్ర సమస్యగా సృష్టించే ప్రయత్నం చేసి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నావిస్ సహా కేంద్రమంత్రిని దీక్షాస్థలి వద్దకు పంపి.. దీక్షను విరమింపజేసేందుకు బీజేపి ప్రభుత్వం సఫలీకృతమైంది.
అయితే కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా అన్నా దీక్షస్థలి వద్దకు వెళ్లి ఆయన కోరుకున్నట్లుగానే రైతుల హక్కులు కాపాడేందుకు తమ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి అందోళనకారులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తమ ప్రభుత్వం అన్నా హాజారే హామీలను నెరవేర్చందుకు కృతనిశ్చయంతో వుందని ప్రసంగిస్తున్న క్రమంలో ఆయనకు చేధు అనుభవం ఎదురైంది.
అందోళనకారుల్లోని గుర్తుతెలియని వ్యక్తి ఫడ్నావిస్ ప్రసంగిస్తున్న క్రమంలో ఆయనపై షూ విసిరారు. అయితే అది కాస్తా అయనను తగలకుండా అయనకు కుడివైపుగా కొద్ది దూరంలో అక్కడ వేదికపైన కూర్చున్నవారిపై పడింది. కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున ఫడ్నవిస్ చెబుతుండగానే ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరు అని పరిశీలిస్తున్నారు. అయితే బీజేపి ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా.. అన్నా మద్దుతుదారులు మాత్రం వ్యతిరేకంగానే వున్నారని, వారిలో అగ్రహం మాత్రం చల్లారలేదనడానికి ఈ ఘటనే నిదర్శనం.
#WATCH Shoe hurled at stage while Maharashtra CM Devendra Fadnavis addressed farmers' protest lead by Anna Hazare at Delhi's Ramlila Maidan pic.twitter.com/BmYVWPKazG
— ANI (@ANI) March 29, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more