రాజు గారి చేపల చెరువు సీనిమాను చూశారా..? అచ్చం అలానే కాకపోయినా.. అదే తరహాలో లేని చేపల చెరువులను వున్నట్లు నకిలీ డాక్యమెంట్లు చూపించి.. వీరికి గ్యారంటీగా కొందరు పారిశ్రామిక వేత్తలను కామన్ గ్యారంటర్లుగా పెట్టింటి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, తరువాత ఎస్బీఐ, బాటలోనే ఐడీబిఐ బ్యాంకులు కూడా పయనించాయి. నగల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలో రూ. 13 వేల కోట్ల మేర కాకపోయినా.. తమ స్థాయికి తగట్టుగానే రూ. 772 అసలుకు నష్టపోయింది పబ్లిక్ సెక్టార్ యూనిట్ బ్యాంకు ఇండస్ట్రీయల్ డెవెలంప్ మెంట్ బ్యాంకు అప్ ఇండియా (ఐడీబిఐ).
చేపల చెరువుల వ్యాపారం పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ఐదు బ్యాంకుల్లో రూ. 772 కోట్ల మేర రుణాలను పోందిన పెద్దలు రుణాలను అసలు కానీ వడ్డీ కానీ కట్టకపోవడంతో.. తాజాగా బ్యాంకు అధికారులు తమ సంస్థాగత విచారణ తరువాత సిబిఐని అశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కుంభకోణం ముంబైలోని ఓ బ్యాంకులోనూ జరిగినా.. వారు రమారమి రుణాన్ని రాబట్టుకోవడంతో.. కేవలం తెలుగు రాష్ట్రాలైన అంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఐడిబిఐ బ్యాంకుల్లో మాత్రమే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని వెల్లడైంది.
2009 నుంచి 2013 వరకు లేని చేపల చెరువులను తాము తీసుకుంటున్నట్లు నకిలీ డ్యాకుమెంట్లను తయారు చేయించి.. వీరందరికీ గ్యారంటీగా కామన్ పారిశ్రామిక వేత్తలు వున్నట్లు కూడా చూపడంతో బ్యాంకు అధికారులు వారికి రుణాలను మంజూరు చేశారు. అడిట్ లో బయటపడిన విషయంతో ఐడీబిఐ అధికారులు సీబీఐని అశ్రయించారు. అయితే కేవలం ఇధ్దరు అధికారుల మాత్రమే వీరందరికీ రుణాలను మంజూరు చేశారని బ్యాంకు అంతర్గత దర్యాప్తులో తేలింది. కాగా వారిలో ఒకర్ని ఉద్యోగం నుంచి తొలగించగా, మరోకరు ఇప్పటికే రిటైరయ్యారు. ఈ కుంభకోణం వివరాలు బయటకు రాగానే ఐడీబీఐ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more