కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరుణంలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. తమ ప్రభుత్వమే ఇంకా కర్ణాటకలో సాగుతుందనుకున్నారో లేక, నిజాలను ఇలాగైనా అంగీకరించాలని భావించారో కానీ తమ నేత పాలన ఎలా వుండిందన్న విషయాన్ని చెప్పి.. నాలుక కర్చుకున్నారు. ఆనక అలా కాదు.. ఇలా అని అన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదెలా అంటే ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వస్తుందని, ఈ సారి గతంలో కన్నా మెరుగ్గా స్థానాలను సంపాదించుకుంటుందని ఇప్పటికే సర్వే సంస్థలు వెల్లడించగా, తమ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలన్న అంశంమై బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనమునకలైన క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేకూర్చేలా చేశాయి.
అమిత్ షా చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు కాంగ్రెస్ కు తిరుగులేని ఆయుధంగా మారింది. కర్ణాటక ఎన్నికల తేదీల ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే బీజేపి ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాలవ్యా చేసిన చేసిన ట్విట్ విమర్శలకు దారి తీయగా, ఇక అమిత్ షా కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వీట్ న్యూస్ అందించి.. సొంత పార్టీ నేత యడ్యూరప్పకు మాత్రం చేదు గుళికను అందించారు. అదెలా అంటే.. ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వున్న అమిత్ షా.. బీజేపీపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో రాష్ట్రంలోని దావణగెరేలో మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు.
ఈ మధ్యే సుప్రీంకోర్టుకు చెందిన ఓ రిటైర్డు జడ్జి దేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి మాట్లాడుతూ, ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం యెడ్యూరప్పదే అని చెప్పారని షా తెలిపారు. అదే సమయంలో అమిత్ షా పక్కనే యెడ్యూరప్ప కూడా కూర్చున్నారు. షా మాటలతో యెడ్డీ కంగుతిన్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో నేత షా చెవిలో ఏదో చెప్పారు. దీంతో, చేసిన పొరపాటును గ్రహించిన అమిత్ షా... యెడ్యూరప్ప కాదు, సిద్ధరామయ్య అని సవరించుకున్నారు.
కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. షా మాటలను కాంగ్రెస్ ఆయుధంగా మలుచుకుంది. అమిత్ షా మాటలను క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు... 'ఎట్టకేలకు చివరకు షా నిజాలు మాట్లాడారు' అంటూ సందేశాన్ని కూడా జత చేశారు. అమిత్ షా చేసిన పొరపాటు ఇప్పుడు బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసింది.
The #ShahOfLies finally speaks truth. Thank you @AmitShah pic.twitter.com/WczQdUfw5U
— Siddaramaiah (@siddaramaiah) March 27, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more