జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాన్ అప్పుడే ఎన్నికల సమరాంగమనంలోకి కదం తొక్కారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు క్షేత్రస్థాయి నుంచి బలమైన కార్యవర్గం వున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన పార్టీ.. తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్తున్న క్రమంలో.. ఇన్నాళ్లు అచితూచి అడుగులు వేయాలని భావించింది. కానీ ఇక ఎన్నికలకు సమయం అసన్నమవుతున్న క్రమంలో.. తమ పార్టీ నిర్మాణం, బూత్ స్తాయిలో కార్యకర్తలు, సభ్యులు, మెంబర్లను ఏర్పాటు చేసుకునే దిశగా కూడా కదిలేందుకు సిద్దమైంది. కాగా, ముందుగా, తమ పార్టీ తరపున విజయవాడంలో ఐదుగురు ప్యానెల్ స్పీకర్లను ఏర్పాటు చేసింది.
మీడియాలో జరుగుతున్న రాజకీయ చర్చలకు, పార్టీ తరపున మాట్లేందుకు వీరికి అధికారాలను ఇస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆదేశాలమేరకు విజయవాడలో వివిధ కార్యక్రమాలపై వీరు స్పందిస్తారు. నగరంలోని జనసేన సమన్వయ కార్యాలయంలో పార్టీనేత అద్దేపల్లి శ్రీధర్ ప్యాన ల్ స్పీకర్లను పరిచయం చేశారు. పోతిన వెంకటమహేష్, కాటూరి శ్రీనివాస్, మండలి రాజేష్, కామరాజు హరిష్ కమార్, బొప్పన శాంసన్లు ప్యానల్ స్పీకర్లుగా నియామకమయ్యారు.
త్వరలో రైతులు, విద్యార్థులు, మహిళలు తదితర విభాగాలు, రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ఈ సందర్భంగా శ్రీధర్ చెప్పారు. పార్టీ సభ్యత్వం కొనసాగుతున్నదని, ఇంకా దీనిపై ప్రచారం జరుగుతోందని, యువత ఆకర్షితులవుతున్నారని చెప్పారు. మిస్డ్కాల్తో సభ్యత్వకార్డు కూడా వెంటనే వచ్చేయడం ప్రత్యేకత అన్నారు. పార్టీ కార్యకలాపాలను విస్తృతస్థాయిలో నిర్వహించడానికి తాము ప్రతివారం పర్యటిస్తామని, వివిధ సమాజ సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. జనసైనికులు ఎవరితోనూ గొడవపడరని, దీటుగా, అర్ధవంతంగా సమాధానం చెబుతారని తెలిపారు. పార్టీ ఇమేజ్ను పెంచేందుకు సంయుక్త కృషి జరుగుతుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more