రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంతో అమీతూమి తేల్చుకునేందుకు రాష్ట్రంలోని ఎంపీలు తమ తమ పార్టీలవారీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర విభజనతో అతలాకుతలమైన అంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. గత నాలుగేళ్లుగా ఆ అంశాన్ని తాత్సరం చేసిందని అరోపిస్తూ.. నవ్యాంధ్ర ఎంపీలు అటు అవిశ్వాసానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతును కూడా కూడగట్టుకునే పనిలో వున్నారు.
ఈ క్రమంలో ఇవాళ పార్లమెంటులోని ఉభయ సభల ముందుకు ఈ తీర్మానాలు చర్చకు వచ్చే అవకాశాలు వున్నాయి. ఇక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ అవకాశాలను విపక్షానికి చెందిన పార్టీలు కూడా తమకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నాయి. దీంతో నవ్యాంధ్ర ఎంపీలకు పలు విపక్ష పార్టీలు మద్దుతు పలుకుతున్నాయి. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను కల్పిస్తామని చెప్పిన 84వ పార్టీ ప్లీనరీలో తీర్మాణం ప్రవేశపెట్టిన కాంగ్రెస్.. అవిశ్వాస తీర్మాణానికి మద్దతు పలికింది.
ఏపీకి జరుగుతున్న అన్యాయం.. నవ్యాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుతున్న నాటకాన్ని ఎండగట్టేందుకు సిద్దం అయ్యింది. ఈ క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు యూపీఏ అనుకూల పార్టీలన్నీ కూడా అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నాయి. ఇటు బీజు జనతాదళ్ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, సహా వామపక్షాల పార్టీలు కూడా నవ్యాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా కదం కలుపుతున్నాయి. దీంతో హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఎన్డీయేలో బీజేపీకి సొంతంగానే భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. కాకపోతే, అవిశ్వాసంపై చర్చతో కేంద్రం చర్యలను పార్టీలు కడిగిపారేసే అవకాశముంది.
అవిశ్వాసానికి అనుకూలమైన పార్టీలు, ఎంపీల సంఖ్య:
టీడీపీ - 16
వైసీపీ - 5
కాంగ్రెస్ - 48
టీఎంసీ - 34
వామపక్షాలు - 10
బీజేడీ - 20
ఇతరులు - 7
మొత్తం - 140
అవిశ్వాసానికి వ్యతరేకమైన పార్టీలు, ఎంపీల సంఖ్య:
బీజేపీ - 274
ఎల్జేపీ - 6
శిరోమణి అకాలీదళ్ - 4
జేడీయూ - 2
ఇతరులు - 47
మొత్తం - 333
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more