కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు కూడా తమ గళాన్ని వినిపించాలని ఆయన సూచనలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన రీతిలోనే పార్టీ ఎంపీలు, కేబినెట్ మంత్రులు తమ భయాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంపై మాట్లాడేందుకు ముందుకు రావాలని హితవు పలికారు.
ప్రస్తుత పరిస్థితులు 1975-77లోని ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని నలుగురు జడ్జిలు చేసిన వ్యాఖ్యలపై యశ్వంత్ సిన్హా స్పందిస్తూ, పార్లమెంటు రాజీ పడితే సుప్రీంకోర్టు సరైన రీతిలో నడవకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రజాసామ్యానికి ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు చెప్పినప్పుడు వారి మాటలను క్యాబినెట్ మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. అప్రజాస్వామికంగా జరుగుతున్న అన్ని చర్యలను ఎండగట్టాలని, అందుకు ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు వుందని అన్నారు.
బీజేపీ నేతలు, సీనియర్ కేబినెట్ మంత్రులనూ మాట్లాడాలని తాను కోరుకుతున్నానన్నారు. భయాలన్నీ పక్కనపెట్టి నోరు విప్పాలని ఆయన అన్నారు. 'ఈ ప్రభుత్వంలో భయంతో పని చేస్తున్న కేబినెట్ మంత్రుల గురించి నాకు తెలుసు. భయం గుప్పిట్టో పనిచేయడం కూడా ప్రజాస్వామ్యానికి ముప్పే' అని ప్రభుత్వంపై యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. సిన్హా గతంలోనూ మోదీ సర్కార్ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీపైనా ఘాటు విమర్శలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more