నోట్ల రద్దు చేపట్టి ఏడాది కాలం ముగిసింది. మొదట్లో కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించిన వాళ్లు కూడా క్రమంగా విమర్శించడం మొదలు పెట్టేశారు. దేశంలోనే తొలి డిజిటల్ విలేజ్ గా పేరొందని గ్రామాలు కూడా క్రమంగా నోటుకే ఓటు వేశాయి. ఇక ఈ ఏడాది కాలంలో జరిగిన ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపి విజయం సాధించినా.. క్రమంగా ప్రజల నుంచి మాత్రం కేంద్రంలోని సర్కారుపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతుందని గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.
ఈ విషయాలను పక్కనబెడితే కేంద్రం తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజలను నోట్ల రద్దు అంశాన్ని మర్చిపోయేలా చేయడం లేదు. ఇటీవలే రూ.2000లోపు జరిపే డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసే చార్జీలను మినహాయించనున్నట్లు ప్రకటించిన తరుణంలోనే ఇటు మరో కొత్త నోటును కూడా చెలమణిలోకి తీసుకువచ్చింది. ఇవాళే ఈ కొత్త రూ.10 నోట్లును ఆర్బీఐ విడుదల చేసింది. చాకొలెట్ రంగులో మహాత్మా గాంధీ బొమ్మతో పాటు ఒడిశాలోని ప్రముఖ కోణార్క్ ఆలయం డిజైన్ కూడా నోటుపై ముద్రించింది. కొత్త నోట్లు విడుదల చేసినా పాత రూ.10 నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
కొత్త రూ.10 నోటు ఫీచర్లివే..
* పాత నోటులో ‘10’ సంఖ్య మధ్యలో ఉండేది. కానీ ఈ కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ముద్రించారు.
* గాంధీ బొమ్మను మధ్యలో ముద్రించారు.
* ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తును ముద్రించారు.
* ఎడమ వైపు ఉండాల్సిన అశోక చక్రను కుడివైపునకు మార్చారు.
* కొత్త రూ.10 నోట్లు ప్రవేశపెట్టి పదేళ్లు అయిన సందర్భంగా ఎడమవైపు పది సంఖ్యను ముద్రించారు.
* నోటులో స్వచ్ఛ భారత్ లోగో కూడా కన్పిస్తోంది.
* ఈ నోటు పరిమాణం 63X123 మిల్లీమీటర్లు ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more