నోట్ల రద్దు చేపట్టి ఏడాది కాలం ముగిసింది. మొదట్లో కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించిన వాళ్లు కూడా క్రమంగా విమర్శించడం మొదలు పెట్టేశారు. దేశంలోనే తొలి డిజిటల్ విలేజ్ గా పేరొందని గ్రామాలు కూడా క్రమంగా నోటుకే ఓటు వేశాయి. ఇక ఈ ఏడాది కాలంలో జరిగిన ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపి విజయం సాధించినా.. క్రమంగా ప్రజల నుంచి మాత్రం కేంద్రంలోని సర్కారుపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతుందని గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.
ఈ విషయాలను పక్కనబెడితే కేంద్రం తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజలను నోట్ల రద్దు అంశాన్ని మర్చిపోయేలా చేయడం లేదు. ఇటీవలే రూ.2000లోపు జరిపే డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసే చార్జీలను మినహాయించనున్నట్లు ప్రకటించిన తరుణంలోనే ఇటు మరో కొత్త నోటును కూడా చెలమణిలోకి తీసుకువచ్చింది. ఇవాళే ఈ కొత్త రూ.10 నోట్లును ఆర్బీఐ విడుదల చేసింది. చాకొలెట్ రంగులో మహాత్మా గాంధీ బొమ్మతో పాటు ఒడిశాలోని ప్రముఖ కోణార్క్ ఆలయం డిజైన్ కూడా నోటుపై ముద్రించింది. కొత్త నోట్లు విడుదల చేసినా పాత రూ.10 నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
కొత్త రూ.10 నోటు ఫీచర్లివే..
* పాత నోటులో ‘10’ సంఖ్య మధ్యలో ఉండేది. కానీ ఈ కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ముద్రించారు.
* గాంధీ బొమ్మను మధ్యలో ముద్రించారు.
* ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తును ముద్రించారు.
* ఎడమ వైపు ఉండాల్సిన అశోక చక్రను కుడివైపునకు మార్చారు.
* కొత్త రూ.10 నోట్లు ప్రవేశపెట్టి పదేళ్లు అయిన సందర్భంగా ఎడమవైపు పది సంఖ్యను ముద్రించారు.
* నోటులో స్వచ్ఛ భారత్ లోగో కూడా కన్పిస్తోంది.
* ఈ నోటు పరిమాణం 63X123 మిల్లీమీటర్లు ఉంది.
(And get your daily news straight to your inbox)
Jul 06 | ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త మాల్వేర్ తో ముప్పు పొంచి ఉందని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ మాల్వేర్ పేరు టోల్ ఫ్రాడ్. పేరులోని ఫ్రాడ్ కు తగ్గట్టుగానే ఇది మహా... Read more
Jul 06 | దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి... Read more
Jul 06 | చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు.... Read more
Jul 06 | దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో... Read more
Jul 06 | హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో... Read more