New Twist in Sowmya Rajesh Suicide Case | వైజాగ్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్

New twist in vizag family suicide case

Vishakapatnam, Family Suicide, Sowmya Rajesh Couple, Suicide Letter, Vishaka Suicide Letter, Vizag Suicide Letter, Vizag Sowmya Suicide Reason

Sowmya Rajesh Couple Hangs Themselves After Gives Poison To Their Two Childrens Vishakapatnam. Police Think Firstly due to Financial Problems. After Suicide Note Collects They Suspect that Sexual Harassment behind it.

వైజాగ్ ఫ్యామిలీ సూసైడ్ లో కొత్త ట్విస్ట్

Posted: 01/05/2018 06:41 PM IST
New twist in vizag family suicide case

విశాఖపట్నంలో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆరిలోవలోని ముస్తఫా కాలనీలో సౌమ్య, రాజేష్ దంపతులు, తమ ఇద్దరు బిడ్డలు విష్ణుతేజ, జాహ్నవీలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత కుటుంబ కలహాలు అని భావించిన పోలీసులకు కీలక ఆధారంగా సూసైడ్ నోట్ లభించింది. 

ఆత్మహత్యకు ముందు సౌమ్య నాలుగు పేజీల సూసైడ్ నోట్ ను రాసింది. ఈ నోట్ లో సంచలన ఆరోపణలు చేసిన మృతురాలు సౌమ్య, చాలామంది కామాంధులు తన చుట్టూ తిరిగారని, ఇక వారి వేధింపులు భరించలేక పోతున్నానని వాపోయింది. వారి ఆగడాలను తట్టుకునే శక్తి ఇక లేదని, బ్లాక్ మెయిల్, బెదిరింపులు భరించలేకనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. చాలా చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నానని, ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తరువాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా తీసుకెళుతున్నానని సూసైడ్ నోట్ లో రాసింది.

తన బంధువర్గంలోని ఆడపిల్లలు ప్రియ, పవిత్రలకు జాగ్రత్తలు చెప్పింది. చాలా మంది కామాంధులు ఉన్నారని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోట్ ను విశ్లేషిస్తున్న పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, రాజేష్ కూడా ఆత్మహత్యకు ఎందుకు ఉపక్రమించాడన్న విషయం ఇంకా తేలలేదని, వారి మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని విచారిస్తున్నామని, సౌమ్యపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అన్న విషయం నిర్ధారణకు రావాల్సి ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles