దసరా పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్నారా..? అయితే ఒక్క నిమిషం.. అర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సాధారణ రేట్లకు బదులు అధికంగా వసూళ్లు చేస్తారన్నది తెలిసిన విషయమే. ఈ పండగకు అలాంటి ఇబ్బందులు ప్రయాణికులు పడకూడదనే పండగ వేళ ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఇక ఎందుకు అలస్యం వెంటనే మీ టికెట్లను రిజర్వు చేసుకోండి.
విశాఖపట్నానికి..
హైదరాబాద్ నుంచి అటు కాకినాడ, ఇటు విశాఖకు ఈ ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడపనుంది. హైదరాబాద్ విశాఖ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను దసరా సందర్భాన్ని పురస్కరించుకుని నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించింది. ఈ నెల 28, 30 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖకు చేరుకోనుంది. అలాగే ఈ నెల 29, అక్టోబర్ 1 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
కాకినాడకూ..
హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్టుకు మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాకినాడకు వెళ్లే ఈ రైలు ఈ నెల 27, 29 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.35 గంటలకు చేరుకోనుంది. కాకినాడలో ఈ నెల 28, అక్టోబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి కాకినాడకు అక్టోబర్ 1న మరో రైలు ఏర్పాటుచేశారు. ఈ రైలు రాత్రి 11.40 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు కాకినాడకు చేరుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more