వైవాహిక వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో భార్యల సమ్మతి లేకుండా వారితో శృంగారంలో పాల్గొన్నా దానిని మారిటల్ రేప్ గా పరిగణించలేమని ఇటీవల తీర్పును వెలువరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. అదే వివాహ బంధంతో ఏకమైయ్యే భార్యభర్తల మధ్యమాత్రం కూలింగ్ పిరియడ్ అన్నది లేకుండా విచారిస్తున్న కింద కోర్టులో విడాకుల కేసులను విచారిస్తున్న న్యాయమూర్తుల అభిప్రాయానికే వదిలేస్తూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
భార్యాభర్తలు విడిపోతామని నిర్ణయించుకున్నాక, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే అవకాశం లేనప్పుడు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదని, ట్రయల్ కోర్టులు వారికి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. 8 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్న ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేస్తూ ఆరు నెలల కూలింగ్ పిరియడ్ను సవరించి విడాకులు మంజూరు చేయల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ లలిత్లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
నిజానికి 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల కోసం దరఖాస్తు చేసిన ఆరు నెలల వరకు డైవోర్స్ మంజూరు చేయడానికి వీల్లేదు. దరఖాస్తుదారుల మనసులు మారే అవకాశం ఉండడంతో చట్టంలోని 13బి (2) సెక్షన్ ఆరు నెలల పాటు కూలింగ్ పిరియడ్ను పేర్కొంది. అయితే దంపతులు తాము ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండే అవకాశం లేదని బలంగా భావిస్తే ఈ నిబంధనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. కాబట్టి ఆ ఆరు నెలల కాల వ్యవధిని సడలించి విడాకులు మంజూరు చేసే అవకాశం ట్రయల్ కోర్టులకు ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more