జంక్ ఫుడ్ పట్ల అసక్తి, మక్కువను కనబరుస్తూ.. వాటిని విరివిగా లాగిస్తూ.. ఒబెసిటీ, మధుమేహం సహా ఇతర వ్యాధులకు తమ దేహాలను నిలయాలుగా మారుస్తున్న క్రమంలో కేంద్రం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఇవి నేరుగా కేంద్రం ప్రభుత్వం ద్వారా అమల్లోకి రాకుండా బంగారు భారత్ కు బాటలు వేయాల్సిన రేపటి తరం వారిని వాటి నుంచి దూరంగా వుంచేందుకు నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా వున్న అన్ని వృత్తి విద్యా యూనివర్సిటీలతో పాటు కాలేజీల్లో జంక్ ఫుడ్ ను నిషేధించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేస్తూ స్పష్టమైనా అదేశాలు జారీ చేసింది.
భారత సంప్రదాయక వంటకాలతో పాటు అల్పాహారాలను, ఇతర స్కాక్స్ ను కాలేజీ క్యాంటీన్లలో, ఆవరణలో ఏర్పాటు చేయాలని అదేశించింది. కాలేజీ క్యాంటీన్ల అవరణలో జంక్ ఫుడ్ను విక్రయించడానికి, వండటానికి వీల్లేదని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ నిబంధనను తమ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్మెంట్ కాలేజీ యాజమాన్యాలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. కాలేజీల ఆవరణలో విక్రయించే ఆహార పదార్థాలను యాజమాన్యాలే నియంత్రించాలని అదేశాలను జారీ చేసింది.
ఇక వృత్తివిద్యా కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు భారతీయ వంటకాలపై మక్కువను పెంచేలా యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇకపై ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్మెంట్ విద్యార్థులు జంక్ ఫుడ్ ను తినకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీలదేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 10 వేల కాలేజీల్లో ఈ నిబంధనల అమలుకు యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టాలని ఏఐసీటీఈ సూచించింది. దీనిని రాష్ట్రంలో 500కు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, నర్సింగ్ కాలేజీ యాజమాన్యాలు అన్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
ఇక ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, నర్సింగ్ కాలేజీల ఆవరణలో సిగరెట్, గుట్కా, డ్రగ్స్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించింది ఏఐసీటీఈ. వీటి వినియోగంతో ఏర్పడే అనారోగ్యం సమస్యలపై విద్యార్థులలో అవగాహన కల్పించాలని ఇందుకోసం ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలని కూడా సూచనలు చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాలు కాలేజీల ఆవరణలో ఉండటానికి వీల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. కాలేజీల్లోని ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ల నేతృత్వంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని వివరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more