ఆంధ్రప్రదేశ్ లో ఓ ఐఏఎస్ అధికారి చెల్లెలు రెండు రోజులుగా కనిపించకుండా పోవటం సంచలనంగా మారింది. ఆమె అదృశ్యం వెనుక మాజీ ఎమ్మెల్యే తనయుడి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తుండటం విశేషం. పెళ్లైందన్న విషయాన్ని దాచి ఆ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడని, తీరా విషయం తెలిశాక నిలదీయటంతో ఆమెను మాయం చేసి ఉంటాడన్న అనుమానాలు ఆమె తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి
కర్ణాటక క్యాడర్ కలెక్టరుగా పనిచేస్తున్న అధికారి చెల్లెలె సూర్యకుమారి విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ ను ప్రేమించింది. అయితే అతనికి ఇప్పటికే వివాహం అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం సూర్యకుమారికి తెలియటంతో రెండు రోజుల క్రితం అతని ఇంటికి వెళ్లి నిలదీసింది. అప్పటి నుంచే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో సూర్యకుమారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
సూర్య కుమారి తమ ఇంటికి వచ్చిన మాట నిజమేనని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయిందని విద్యాసాగర్ తల్లి చెబుతోంది. అర్థరాత్రి 1.40 గంటలకు సూర్యకుమారి తన ఇంటికి వచ్చిందని, కాసేపు మాట్లాడి పంపించానని ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది. ఓ కలెక్టర్, ఓ మాజీ ఎమ్మెల్యేల కుటుంబాల మధ్య కేసు కావడంతో పోలీసులు రహస్యంగా విచారిస్తున్న క్రమంలో మీడియా కంటపడి వెలుగులోకి వచ్చింది. పోలీసులు విద్యాసాగర్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
"బాబీ నిన్ను ఎంత ఇష్టపడ్డానో. నన్ను పెళ్లి చేసుకోవాలని నీ వెంట పడ్డాను. నువ్వు వద్దన్నా నిన్ను బలవంతం చేశాను. ఇంట్లో మా వాళ్లకు అన్నీ తెలిశాయి. ఇప్పుడు నన్ను ఎక్కడికైనా, నీ నుంచి దూరం తీసుకెళ్లి పోవాలని ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. వాళ్ల మూవ్ మెంట్ ని బట్టి నేను అలర్ట్ గా ఉంటాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నన్ను తీసుకెళ్లిపోయినట్టు నీకు తెలిస్తే, నీ లైఫ్ ని రిస్క్ లో పెడతారేమో చాలా జాగ్రత్తగా ఉండు" అంటూ తన అదృశ్యానికి ముందు సూర్యకుమారి పెట్టిన మెసేజ్ కలకలం రేపుతోంది. కాగా, సూర్యకుమారి అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారగా, ఆమె ఎక్కడుందో పోలీసులు కనిపెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వాళ్ల సంబంధం తెలుసు: విద్యాసాగర్ భార్య
సూర్యకుమారి తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కోడలు, విద్యాసాగర్ భార్య వెల్లడించింది. ఆపై ఓ పావుగంట తరువాత వెళ్లిపోయిందని, ఆ అమ్మాయిని ఇంట్లో దించి వస్తానని తన భర్త కూడా వెనకాలే వెళ్లాడని ఆమె అంటోంది. అసలేం జరిగిందో తెలీకుండా తన భర్తను అరెస్ట్ చేశారని, ఆయన్ను ఎందుకు తీసుకెళ్లారో, ఎక్కడ పెట్టారో తెలియడం లేదని, తన భర్త పరిస్థితిపై ఆందోళనగా ఉందని వాపోయారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉండి వచ్చానని చెప్పిన ఆమె, తన భర్తను క్షేమంగా అప్పగించాలని కోరింది. ఆమె తన ఫోన్ ను భర్తకు ఇచ్చి వెళ్లిందని మీడియాకు వెళ్లడించింది. తన భర్తకు ఓ యువతితో సంబంధం ఉందని తనకు ఒక సంవత్సరం క్రితమే తెలిసిందని, అయితే, అది సూర్యకుమారితోనేనన్న విషయం మాత్రం తెలియదని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more