దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోమారు తన ఖాతాదారులకు చేదువార్తను అందించింది. ఓ వైపు నదగు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని అటు కేంద్రం, ఇటు భారతీయ రిజర్వు బ్యాంకు అదేశాలిస్తున్నా.. పాత నోట్ల రద్దు తరువాత మొబైల్ యాప్, ఇంటర్ నెట్, అన్ లైన్ బ్యాంకింగ్ లలో నగదును బదిలీ చేస్తున్న వారికి కొంత కాలం కింద సర్వీస్ చార్జీల పేరుతో షాక్ విధించిన ఎస్బీఐ.. తాజాగా మరోమారు కూడా ఖాతాదారులకు చేదువార్తను అందించింది.
అన్ లైన్, యాప్ నగదు బదిలీలపై చార్జీలు:-
జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఏకీకృత పన్నువిధానం జీఎస్టీ నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్సఫర్లపై కొత్త చార్జీలు వర్తిస్తాయని ఎస్బీఐ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ 18శాతంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా అమల్లోకి వచ్చిన కొత్త చార్జీలు ఇలా వున్నాయి. రూ.1000 కి ఎలాంటి చార్జీలు లేకుండా, రూ.1000 నుంచి రూ.1 లక్ష కు రూ.5+జీఎస్టీ , రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల ట్రాన్సఫర్లకు రూ.15+జీఎస్టీ చార్జీలను ఖరారు చేసింది.
ఏటీయం కార్డుల జారీపై చార్జీలు
కొత్త డెబిట్ కార్డు కావాలని కోరుకునే వారు ఇకపై బ్యాంకుకు డబ్బు చెల్లించాల్సి వుంటుంది. అయితే ఇది జూన్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. కాగా రూపే క్లాసిక్ కార్డుల మాత్రం ఉచితంగా బ్యాంకు అందించనుంది.
పాత నోట్లు మార్పిడిపై చార్జీలు
చెలామణిలో వున్న పాత నోట్లు చిరిగినా.. లేక పాతబడిపోయినా వాటిని మార్చేందుకు కూడా బ్యాంకులు ఇకపై ఖాతాదారుల నుంచి పన్నులతో పాటు చార్జీలను వసూలు చేయనున్నాయి. ఒక ఖాతాదారుడు 20 పాత నోట్ల కన్నా అధికంగా లేదా మొత్తంగా పాడైన నోట్ల విలువ రూ.5 వేలు దాటినా.. రెండు రూపాయల చార్జీతో పాటు పన్నులు కూడా చెల్లించాల్సి వుంటుంది.
చెక్ బుక్ లు పోందేందుకు చార్జీలు
జూన్ 1 నుంచి సాధారణ పొదుపు బ్యాంకు ఖాతా వున్న ఖాతాదారులు పది చెక్కులతో కూడిన చెక్ బుక్ పొందేందుకు రూ. 30 చార్జీతో పాటు జీఎస్టీ పన్ను చెల్లించాల్సివుంటుంది. ఇక 25 చెక్కులతో వున్న చెక్ బుక్ ను పోందేందుకు రూ.75 చార్జీతో పాటు జీఎస్టీ పన్నులు.. 50 చెక్కులతో కూడిన చెక్ బుక్ పోందేందుకు రూ.150 చార్జీతో పాటు జీఎస్టీ పన్నులు కలిపి చెల్లించాల్సి వుంటుంది. అయితే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తూట్లు పోడుస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
మొబైల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వెనువెంటనే నగదును బెనిఫిషియరీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే నగదు రహిత లావాదేవీలు ప్రోహత్సహించే క్రమంలో భఆగంగా ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను వేయకూడదని ఇప్పటికే అభ్యర్థిస్తున్నా.. బ్యాంకు మాత్రం ఈ సరికొత్త నిబంధలను జూన్ 1 నుంచి అమలు చేస్తుండగా, ఇక జీఎస్టీ పేరుతో మారోమారు ఖాతాదారులపై భారం మోపేందుకు సిద్దం కావడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more