ఉరిమిన ఉత్సాహం అంటూ ప్లీనరీతో వైసీపీలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. 2019 లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్ అండ్ కో పాదయాత్ర అనే పవర్ ఫుల్ అస్త్రంతో ప్రజలకు చేరువయ్యేందుకు యత్నాలు మొదలుపెట్టబోతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అక్టోబర్ 27 నుంచి ఏపీలో వైసీపీ చీఫ్ పాద్రయాత్ర మొదలుకాబోతుంది. ఈ నేపథ్యంలో తమ అధినేత గురించి, పాలన గురించి, మరీ ముఖ్యంగా జగన్ పాదయాత్రపైనే టీడీపీ నుంచి కౌంటర్ లు పడుతాయని అంతా ఆశించారు. కానీ, ఊహించని వ్యక్తి నుంచే మొదట స్పందన రావటం ఇక్కడ విశేషం.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే పార్టీ విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలను జరుపుతున్నాడు కూడా. జగన్ పాదయాత్ర ప్రకటన తర్వాత జరిగిన భేటీలోఈ ప్రస్తావన రాగా, పవన్ దీనిపై స్పందించాడు. నిజానికి ఈ యేడాదిలో తాను అనంతపురంలో పాదయాత్ర చేద్దామని భావించానని, కానీ, ఇప్పుడు వాళ్లు కూడా పాదయాత్ర అంటూ ముందుకొచ్చారని, ఆ ప్రకటనతో తనకేం సంబంధం లేదని చమత్కరించాడు.
పాదయాత్ర ఎవరూ చేసినా ఫర్వాలేదన్న ఆయన, ముందు ప్రకటన చేసి ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలిచామన్న విషయం సంతోషాన్ని కలిగిస్తుందన్నాడు. వాళ్ల యాత్రతో ప్రజాసమస్యలు పరిష్కారం అయితే ఇంకా సంతోషిస్తానని పేర్కొన్నాడు. ఈ పోరాటంలో విజయం సాధించి, ఆ పేరు మొత్తం వాళ్లకే వెళ్లినా తానేం బాధపడనని చెప్పుకొచ్చాడు. ఇక అధికారాన్ని ఎదురించే దమ్మున్న యువత మాత్రమే జనసేన పార్టీలోకి రావాలంటూ పిలుపునిచ్చిన పవన్, త్వరలో అన్ని జిల్లాల కార్యకర్తలతో విడివిడిగా భేటీలు జరపనున్నట్లు ప్రకటించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more