ఒక ఊరి పటేల్ మరో ఊరికి కావలికారుతో సమానమన్నది పెద్దలు చెప్పిన నానుడి. అయితే ఈ రోజుల్లో ఏ మారుమూల గ్రామం నుంచి జాతీయ, అంతర్జాతీయ నాయుకుడిగా ఎదిగిపోవచ్చ. అయినంతమాత్రన.. ఏ విషయంపైన అయినా సరే గుడ్డిగా వాదించకూడదు. ముందుగా సమాచారం తెలుసుకోవాలి. తెలిసిన సమాచారం కరెక్టేనా అని రూడీ చేసుకోవాలని ఆ తరువాత దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సభలు, సమావేశాల్లో అయినా.. లేక సామాజిక మాద్యమాల ద్వారా అయినా సరే. లేకపోతే విమర్శలే కాదు అప్పడప్పుడు ఇబ్బందులు కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఈ విషయంలో తప్పటడగుడులు వేసిన ఎంతటి నేతకైనా చిత్కారాలు తప్పవు. దేశప్రజలంతా వేనోళ్ల పొడిగిన మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. విదేశీ పర్యటనలో జాతీయజెండాను తిరగేసి వున్న విషయాన్ని గమనించకుండా వెళ్లినప్పుడు కూడా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా హర్యానా బీజేపీ నాయకురాలు విజేత మాలిక్ కూడా అలాంటి పరాభావాన్నే మూటగట్టుకుంటుంది. పశ్చిమ బెంగాల్లో హిందువుల పట్ల తృణమూల్ కాంగ్రెస్ సర్కారు ఇలా ప్రవర్తిస్తోందంటూ అమె షేర్ చేసిన ఓ ఫోటోనే అమెను విమర్శల పాటు చేసింది.
అమె తన ఫేస్ బుక్ పేజీలో మహిళ చీరను రౌడీ లాగుతూ ఉన్న భోజ్పురి సినిమా ‘ఔరత్ ఖిలోనా నహీ’లోని ఒక ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. హిందువుల పరిస్థితి ఇలా ఉందని పేర్కొన్న ఆమె, హిందువులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. దీదీ సర్కారు శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వుందని ఎద్దేవా చేశారు. అయితే, ఇటువంటి ఫొటో పోస్ట్ చేసిన విజేత మాలిక్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యకు పాల్పడ్డ ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె స్త్రీలను కించపర్చారని నెటిజన్లు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more