తెలంగాణలో డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తన పలు వర్గాలవారిని టార్గెట్ చేసిన మాఫియా.. చివరకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇంజనీరింగ్, మెడిసస్ కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసింది. అక్కడితో కూడా అగని మాఫియా జడలు విప్పి కళారా నృత్యం చేసేందుకు సంపన్నల పిల్లలు చదువుతున్న పాఠశాలలను కూడా లక్ష్యంగా చేసుకుని కలకలం రేపింది. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతో మొత్తం వ్యవహరం వెలుగుచూసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మరో రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ అయిన ఎక్సైజ్ శాఖ అనుమానాస్పందంగా కలిగిన అన్ని వస్తువులపై తనిఖీలు చేస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ లకు చెందిన కంపెనీల తయారు చేసిన చాకెట్లుగా ముద్రవేసుకు.. ఐఎస్ఓ మార్కుతో మార్కెట్లోకి విడుదలయిన చాకెట్లలో మత్తు పదార్థాలు వున్నాయన్న పక్క సమాచారంతో అధికారలు దాడులు నిర్వహించారు. మదు మునక్క అన్న పేరుతో వస్తున్న మాయదారి చాకెట్లలో తింటే మత్తుకు బానిసలవుతారని తెలుసుకున్న అధికారులు దాడులు జరిపారు.
నిజామాబాద్ పట్టణంలోనూ లలితామహల్ సెంటర్ వద్ద వున్న పద్మావతి నావెల్టీస్ దుకాణంలో ఈ చాకెట్లు అమ్ముడవుతున్నాయన్న సమాచారంతో దుకాణం యజమానిని అరెస్టు చేశారు. గంజాయి, భంగ్ లతో తయారు చేసిన మధుమునక్కా చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పేరు శారద శరత్ కుమార్ అని పోలీసులు తెలిపారు. చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ప్రణాళిక ప్రకారం వెళ్లి అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో మరెంత మంది హస్తం ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
టీనేజ్ పిల్లలని అటువైపుగా ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతోంది. హైదరాబాద్ లో మొత్తం 1000 మందికిపైగా పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని పోలీసులు అంటున్నారు. టీనేజ్ పిల్లలనే లక్ష్యంగా చేసుకుని వారితో డ్రగ్స్ ముఠాలోని సభ్యులు పరిచయాలు పెంచుకుని, మంచి కిక్ ఇస్తోందని నమ్మిస్తూ డ్రగ్స్ ను అలవాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా కూడా పిల్లలకు డ్రగ్స్ ముఠా వల వేస్తోందని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more