కాపుల రిజర్వేషన్లపై చావో రేవో.. అంటూ చలో అమరావతి పాదయాత్రకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు. తమ కమిటీ కేవలం కాపుల రిజర్వేషన్ల కోసమే పర్యటన చేయటం లేదని, బీసీలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని జస్టిస్ మంజునాథ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే కమిటీతో ఇలాంటి స్టేట్ మెంట్లు ఇప్పిస్తుందని ఆయన ఆరోపించాడు.
మంజునాథ కమిషన్ ముమ్మాటికీ కాపుల కోసం వేసిన కమిషనేనని, బీసీల కోసం వేసిన కమిషన్ అయితే, పదమూడు జిల్లాల్లోని కాపులను ఆహ్వానించటం ఎందుకని ముద్రగడ ప్రశ్నించాడు. తూర్పుగోదావరి జిల్లాకు మంజునాథ వచ్చినప్పుడు తననూ ప్రత్యేకంగా పిలిచారని, ఇప్పుడు బీసీల కోసం వేసిందని ఇప్పుడు మంజునాథ మాట మార్చడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నాడు. తెలంగాణ లో గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్లకోసం 9వ షెడ్యూలులో చేరుస్తూ కేంద్రానికి నివేదిక పంపించారని, చిత్తశుద్ది అంటే కేసీఆర్ లా ఉండాలని, చంద్రబాబుకు అది లేదని విమర్శించాడు.
కమిటీ వ్యాఖ్యలతో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎంతో ఆవేదన చెందుతున్నారని చెప్పాడు. ఈ నెల 26 లోగా కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపాలని, లేకుంటే ‘చలో అమరావతి’నిరవధిక పాదయాత్రతో తమ సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. తమ పాదయాత్రను అడ్డుకుంటామని అంటూనే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం బెదిరింపులకు దిగటం సరికాదన్నాడు. చట్టాలు అందరికీ వర్తిస్తాయన్న ఆయన ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉండాలని సూచించాడు. కాపు ఉద్యమం ప్రారంభించి ఈ నెల 26 నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. అందుకే పాదయాత్రకు ముద్రగడ సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more