సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏ మాత్ర తీసిపోకుండా శిరీష సూసైడ్ కేసు కొనసాగుతూ వస్తోంది. లోకేషన్ రీకనస్ట్రక్షన్ పేరిట నిందితులను మొన్న రాత్రంతా తిప్పి నిన్న కోర్టుకు అప్పగించేసిన పోలీసులు మీడియాను డైవర్ట్ చేసేందుకు అలా చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే టైంలో నేరం జరిగిన ప్రదేశంగా భావిస్తున్న కుకునూరుపల్లి స్టేషన్ క్వార్టర్స్ లోకి వెళ్లకుండా వచ్చేయటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాము లోపలికి వెళ్లేందుకు యత్నించగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారని, ఆ సమయంలో తాము వాగ్వాదానికి దిగితే గొడవలు తలెత్తి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందన్న ఉద్దేశ్యంతో తాము సైలెంట్ గా వచ్చేశామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ కేసులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పుటేజ్ లభ్యం కాలేదు. అంతే కాకుండా శిరీష కుటుంబ సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా లభ్యం కాలేదు. అనుమానాలు నివృత్తికి తమ వద్దకు రావాలంటూ పోలీసులు పరోక్ష వార్నింగ్ ఇవ్వటంతో తర్వాత వాళ్లు సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో శిరీషది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ రిపోర్టు పై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అది రానే వచ్చేసింది.
శిరీషపై లైంగిక దాడి జరగలేదని ఎఫ్ఎస్ఎల్ ప్రాధమిక రిపోర్టు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాధమిక రిపోర్టులో స్పెర్మొటోజ కనిపించలేదని నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆమె పింక్ కలర్ ఇన్నర్ వేర్ పై మరకలు ఉండటంతో అత్యాచారం అనుమానాలు వ్యక్తం అవ్వటం తెలిసిందే. ఇక ఇప్పుడు నివేదికతో కేసు కొత్త మలుపు తిరుగినట్లయ్యింది. శిరీషపై ఆత్యాచారం జరగని పక్షంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇరు పక్షాల ముందు అనుమానం రేపుతున్న సమాధానం. అయితే ఫోరెన్సిక్ ప్రాధమిక రిపోర్టుకి, ఫైనల్ రిపోర్టుకి తేడాలు కూడా ఉంటాయన్న నిపుణుల వివరణతో కేసు విచారణ మరింత ఆసక్తిగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more