అమ్మకు బోజనం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడన్న నానుడి తెలియని తెలుగువారుండరు. సరిగ్గా అలాగే వుంది ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పరిస్థితి. తన రాష్ట్రానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నా.. ఆయన పతాంజలి యోగఫీఠం అధ్వర్యంలో హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా యోగాభాస్యం చేయిస్తున్నా.. మరోలా చెప్పాలంటే యావత్ ప్రపంచం యోగా డే కోసం పలు ఏర్పాట్లు చేసుకుని దానిని దిగ్విజయంగా ముగించినా.. ఆయన సొంతూర్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా వుంది.
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన స్వగ్రామానికి వెళ్లిన మీడియా షాక్ కు గురికావాల్సి వచ్చింది. యోగా డే రోజున బాబా రాందేవ్ స్వగ్రామంలో అంగరంగవైభవంగా ఏర్పాటు వుంటాయని భావించిన మీడియా విస్మయానికి గురైంది. హర్యానాలోని మహేంద్రఘడ్ ప్రాంత పరిధిలో సైదలిపూర్ గ్రామం బాబా రాందేవ్ స్వగ్రామం. అక్కడ యోగా సంబరాలు కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాకు అసలు ఏమాత్రం ఏర్పాటు జరగకపోవడం షాక్ కలిగించింది. అందుకు పలు కారణాలు కూడా వున్నాయి. గ్రామస్థులే కాదు.. చివరకు బాబా రాందేవ్ వదిన కూడా తాను ప్రతి రోజు యోగాను అభ్యసించనని చెప్పారు. తాను ఎప్పడైనా అస్వస్థతకు గురైతే తప్ప యోగా జోలికి వెళ్లనన్నారు. అయితే గ్రామంలో వున్న విలువ గ్రామస్థులకు తెలియడం లేదని అమె వ్యాఖ్యానించారు.
గ్రామంలో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా గ్రామంలో ఎవరూ యోగా చేయరని సైదలిపూర్ గ్రామ సర్పంచ్, రాందేవ్ చిన్ననాటి స్నేహితుడు దేశ్ పాల్ సంబర్ధర్ అన్నారు. తమ గ్రామంలో ఎక్కడా యోగా వేడుకలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించవని అన్నారు. కొద్దో గోప్పో 20 నుంచి 30 మంది యోగాను అభ్యసిస్తారని అయితే వారు ఇళ్లలో మాత్రమే చేస్తారని అన్నారు. ఇక దీనికి తోడు బాబా రాందేవ్ పై గ్రామస్థులకు వున్న కోపం కూడా మరో కారణంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రామంలోని ఓ మహిళ తన అభిప్రాయపడింది.
బాబా రాందేవ్ హరిద్వార్ కు వలసవెళ్లిన తరువాత.. తన జన్మనిచ్చిన స్వగ్రామానికి ఏదైనా చేయాలని వెళ్లి అడిగిన గ్రామపెద్దలు ఉత్తచేతులతో తిరిగివచ్చారని, దీనికి తోడు గ్రామంలోని నిరుద్యోగ యువత కూడా ఆయన వద్దకు వెళ్లి ఉద్యోగం, ఉపాధి అవకాశాలను అడిగినా.. ఆయన నిద్వందంగా నిరాకరించారని అందుకే అయన పట్ల గ్రామ ప్రజలకు గౌరవం లేదని చెప్పారు. ఇక హరిద్వార్ వెళ్లిన తరువాత బాబా రాందేవ్ పూర్తిగా తమ గ్రామానికి రావడం మానేశారని, యావత్ ప్రపంచాన్ని నెగ్గిన వ్యక్తి సొంత ఊళ్లో మాత్రం విభిన్నమైన పరిస్థితి వుండటంపై విమర్శలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more