పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో బూత్ స్టాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అందరూ జనసైనికులేనని, ఈ పార్టీలో ఎవరూ లీడర్లు వుండరని సంకేతాలు వస్తున్నాయి. కార్యకర్తల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్ఠానం పార్టీ నిర్మాణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలను ప్రశ్నించడమే లక్ష్యంగా చెబుతున్న జనసేనలో నాయకులకు చోటు లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి ఎటువంటి హోదాలు ఇవ్వరని.. అన్ని పార్టీల తరహాలో మాదిరిగా కాకుండా ఈ పార్టీలో అందరూ సమానమేనన్న భావనతోనే ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు కూడా జనసేన్యమేనన్న సంకేతాలు అందుతున్నాయి.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరికీ ఎలాంటి పదవులు ఉండవుని సమాచారం. దీంతో రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు రెడీ అవుతోంది జనసేన. అందరూ జన సైనికులే. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎంపిక చేస్తున్న వారిలో చురుకైన వారికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎంపికైన వారితో పవన్ నేరుగా మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నికైన వారు ఆయా జిల్లాల పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక పార్టీలోకి వలసలకు చెక్ పెట్టనుంది కూడా. ఇతర పార్టీలలో నుంచి వచ్చిన వారు మన పార్టీలో మాత్రం ఎందుకు వుంటారు.. ఇక్కడ కూడా అవసరం తీరిన తరువాత వెళ్లిపోతరాని, అలాంటి నేతలకు అవకాశం ఇవ్వకూడదని కూడా జనసేన భావిస్తుంది. దీంతో పాటు వారసత్వ నేతలను కూడా పార్టీలో చేర్చుకోరాదని నిర్ణయించింది. ప్రజల్లో నుంచే నేతలను ఎంపిక చేసుకునేందుకు ప్రతిభ గల వ్యక్తుల కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలామందిని వడపోసి యువనేతలను ఎంచుకుంది. ఉత్తరాంధ్రలోనూ మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకోబోతోంది. ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకున్న అందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది.
విషయం, ప్రతిభ ఉన్న వారి కోసం మూడు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల రచన, మాట్లాడే తీరు, సమస్యలపై వారికి ఉన్న అవగాహనను వీడియో తీసి నిపుణుల సమక్షంలో దానిని పరిశీలించి మార్కులు వేస్తారు. వారివారి విభాగాల్లో మంచి పనితీరు కనబరిచిన వారిని ఎంపిక చేసి చివరిగా పవన్ నేతృత్వంలో ఓ టీమ్ను ఎంపిక చేస్తారు. ఇదీ జనసేన వ్యూహం. నాయకులు ప్రజల్లో నుంచే రావాలని, వారసత్వ, వలస నేతలను పార్టీకి దూరంగా ఉంచాలని భావిస్తోంది. తద్వారా రాజకీయ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more