బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. భారత బ్యాంకులకు సుమారుగా రూ. 9 వేల కోట్లకు పైగా బకాయి పడి, వాటిని చెల్లించకుండా లండన్ కు వెళ్లి తలదాచుకుంటున్న లిక్కర్ డాన్ పై కోర్టు ధిక్కరణ నేరం కింద సమన్లు జారీ చేసింది. ఆయనపై నమోదైన అర్థిక నేరాలకు సంబంధిన కేసులో కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించినా, దానిని అయన లక్ష్యపెట్టకుండా తానే ఫలాన సమయంలో వస్తానని గడువు విధంచడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది.
కోర్టు అదేశాలను ధిక్కరించడంతో ఆయనపై సమన్లు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. జూలై 10న హాజరు కావాలని ఆదేశించింది. ఈ లోగా విజయ్ మాల్యా న్యాయస్థానం ఎదుట హాజరుకాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. తాజా అదేశాలను కూడా మాల్యా ధిక్కరించి.. వ్యక్తిగతంగా న్యాయస్థానికి హాజరుకాని పక్షంలో ఆయనకు సుమారు ఆరు నెలల కారాగార వాసం పడే అవకాశాలు వున్నాయని న్యాయనిపుణులు పేర్కోంటున్నారు.
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాల్యాకు న్యాయస్థానం తాజా ఆదేశాలతో ఉచ్చు బిగుసుకుంటుంది. దీంతో పాటుగా డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, లండన్ లో ఇటీవల అరెస్ట్ అయి, ఆపై గంటల వ్యవధిలోనే బెయిల్ పై బయటకు వచ్చిన మాల్యాను ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ విభాగాలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more