భూమా నాగిరెడ్డి అకస్మిక మరణంతో వచ్చిన నంద్యాల ఉప ఎన్నికలు మొత్తానికి అధికార, విపక్షాల మధ్య హైవోల్టేజీతో సాగనున్నాయి. ఎన్నికల విషయమై ఇప్పటి వరకు ఎన్నికల కమీషన్ ఏలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా.. అప్పుడే అధికార పార్టీ నుంచి టిక్కెట్ అశించేవారి సంఖ్య పెరుగుతూ పోతుంది. దీంతో ఈ సారి నంద్యాల ఉప ఎన్నికల స్థానంలో రసవత్తర పోరు తధ్యమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు నంద్యాల ఉపఎన్నికల టికెట్ ను అశిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి.. తనకు టికెట్ రాని పక్షంలో విపక్ష పార్టీలో చేరైనా పోటీలో పాల్గొనాలని యోచనలో వున్నారు.
కాగా తమ తండ్రి భూమానాగిరెడ్డి పాతినిధ్యం వహించిన నంద్యాల నియోజకవర్గం నుంచి ఆయన వారసులైన కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. విజయవాడ భవానీ ఐలండ్లో పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో పలు శాఖాపరమై అంశాలపై మాట్లాడారు. వాటితో పాటు నంద్యాల ఉపఎన్నిక విషయమై కూడా ప్రస్తావించారు. నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు.
అయితే ఇలాంటి ప్రకటన చేసే ముందు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖారారు చేసే ముందు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు ప్రధానకార్యదర్శి లోకేష్ నుంచి గానీ అనుమతి తీసుకున్నారా..? లేదా..? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థి తమ కుటుంబవారే అయివుంటారని నేరుగా మీడియా ముఖంగా ప్రకటించిన అఖిలప్రియ.. 24న పేరును కూడా ప్రకటిస్తామని చెప్పడం ఒకింత విస్మయానికి గురిచేయగా, ఇలా అభ్యర్థిని ప్రకటిస్తున్నామన్న విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులకు చెప్పారా..? అన్న సందేభాలు కలుగుతున్నాయి. వారి అనుమతి లేకుండా ప్రకటిస్తే అఖిలప్రియ ప్రకటించిన వారికే వారు టికెట్లు ఇస్తారా..? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి.
నంద్యాల నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి భూమానాగిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయన అకస్మిక మరణంతో అఖిలప్రియకు మంత్రిపదవి ఇచ్చిన దరిమిలా తనకు నంద్యాల టిక్కెట్ ను ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అంశమై చర్చించడానికి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ తరుణంలోనే భూమా అఖిలప్రియ ఇలాంటి ప్రకటన చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మరికోందరు మాత్రం పార్టీ నేతలే అమెతె అక్కడ అలా ప్రకటించాలని చెప్పివుంటారని, వారి సూచనల మేరకే అఖిల అలాంటి ప్రకటన చేసివుంటుందని కూడా అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more