ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు జనసేన అధినేత పవన్ కల్యాన్. గత ఎన్నికలలో నవ్యాంద్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించిన రెండేళ్ల తరువాత ప్రజల్లోకి వెళ్లి తన పార్టీ తరపున సభలు.. సమవేశాలను ఏర్పాటు చేస్తున్న పవన్ కల్యాన్.. తాజాగా కూడా కేంద్రంలోని బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశ్నలను సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది ప్రజలకు, దక్షిణాది ప్రజలకు మధ్య వత్యాసం తీసుకువచ్చేలా చేపడుతున్న చర్యలు సరికావని అన్నారు.
కేంద్రం ఇలాంటి చర్యల మూలంగా దేశ సమగ్రత దెబ్బతినే అవకాశం వుందని ఆయన తూర్పార బట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు రైతు రుణాలను మాఫీ చేయాలని కోరినా.. వాటిని కనీసం పరిగణలోకి తీసుకోని కేంద్రం.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం రైతు రుణాలను మాఫీ చేస్తుందని ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి ప్రకటించిన రుణమాఫీని కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ కల్యాన్ తీవ్రంగా స్పందిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.
సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆయన బీజేపి, ఎన్డీఏ తీరును తప్పుబట్టారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని సూచించారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూపుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రైతులకు వర్తింపజేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా రుణాలను మాఫీ చేయాలని, అక్కడ వర్తింపజేస్తున్నట్లుగానే తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ తీసుకువచ్చారు.
తెలుగు రాష్ట్రాలలోనూ అనేక మంది రైతులు బ్యాంకులకు రుణాలను చెల్లించలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఇప్పటికీ రుణాలను చెల్లించలేక అనేక మంది రైతులు అవస్థులు పడుతున్నారని.. వారి ఇబ్బందులను దూరం చేసేందుకు కేంద్రం రైతు రుణాల మాఫీని తెలుగురాష్టాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో తెలుగు రాష్ట్రాలు రెండూ రైతు రుణమాఫీ కోసం కేంద్రం వద్దకు వెళ్తే నీతులు, కథలు, సూక్తులు చెప్పారని గుర్తు చేస్తూ...ఆ నీతులు, సూక్తులు, కథలు బీజేపీకి వర్తించవా? అని ఎద్దేవా చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) March 17, 2017
— Pawan Kalyan (@PawanKalyan) March 17, 2017
An excerpt from an article by Indian https://t.co/LOgpS9caKj pic.twitter.com/V5FSBoMHbh
— Pawan Kalyan (@PawanKalyan) March 17, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more