ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించే పనిలో వుంది. అదేంటంటారా..? రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి తమ సత్తాను చాటాలనుకుంటున్న వారికి ఇది మిఠాయి లాంటి వార్త. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చిన పలు అంశాలలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ పెంపు కూడా ఇమిడివుంది. దీంతో అ హామీని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడ తాజాగా అమలు పర్చాలని ప్రయత్నిస్తుంది. ఈ వార్త ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకూ శుభవార్తే.
అధికారంలోకి వచ్చాక అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీల్లోకి వలసలు పెరిగాయి. పెద్ద సంఖ్యలో పార్టీల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీలైనంతమందికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో చేరిన వారికి, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం చేయాలని టీఆర్ఎస్, టీడీపీలు భావించాయి. నియోజకవర్గాల పెంపుతో అది సాధ్యమవుతుందన్న నమ్మికతో వారికి ఎడాపెడా హామీలిచ్చాయి. అయితే, కొంతకాలంగా ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో కొంత నిరుత్సాహం చెందాయి. తాజాగా ఇప్పుడీ ప్రతిపాదనలో కదలిక రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో ఉన్న 175 స్థానాలను 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. ఈ విషయంలో గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నియోజకవర్గాల పెంపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్’ పంపాలని కేంద్ర నాయశాఖ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. లోక్సభ స్థానాల పెంపు సాధ్యం కాకపోవడంతో వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను మాత్రం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను తొమ్మిదికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more