దేశం కోసం అహర్నిషలు కష్టపడతూ.. కంటి నిండా కునుకు కరువై తాము సరిహద్దులో పనిచేస్తుంటే.. తమకు కడుపునిండా తిండి కూడా పట్టడం లేదని అందుకు కారణం నాణ్యత లేని బోజనాన్ని పెట్టడం లేదని గత జనవరిలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి సైనికుల దీనస్థితిని దారుణ పరిస్థితులను మీడియాకు విశ్లేషించిన బీఎస్ఎష్ జవాను తేజ్ బహదూర్ సింగ్ గత రెండు నెలలుగా మానసిక క్షోభకు గురవుతున్నాడంటూ తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సందేశంలో పెట్టి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన తేజ్ బహదూర్ మరో కలకలం సృష్టించాడు.
సైన్యం బోజనం తాలుకు వీడియోను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన ఈ జవాను.. తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు. అయితే, గతంలో ఫిర్యాదు చేసిన ఆయన ఈసారి పిటిషన్ రూపంగా ఆ వీడియో సందేశం పంపించాడు. స్వరాజ్ సమాచార్ అనే ఫేస్బుక్ పేజీలో తేజ్ బహదూర్ తాజా వీడియోను పబ్లిష్ చేశాడు. తన మొబైల్ ఫోన్ను పై అధికారులు స్వాధీనం చేసుకున్నారని, పగులగొట్టారని, మానసికంగా హింసిస్తున్నారని తాజా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
‘నేను నా ఫోన్ను తప్పుగా ఉపయోగించానని చెబుతున్నారని నాకు తెలిసింది. నేను ప్రధాని దృష్టికి ఆహార సమస్యను, నాణ్యత విషయాన్ని తీసుకెళ్లాలనుకున్న మాట వాస్తవం. అది నిజమైన సమస్య. అందుకు ఇప్పుడు నన్ను మానసికంగా హింసిస్తున్నారు. దేశంలో అవినీతి అంతం చేయాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. నేను నా శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాలని అనుకుంటున్నాను. నా ఫోన్ను ట్యాంపరింగ్ చేస్తున్నారు. తనకు పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు ఫోన్లో ఏవో అంశాలు జోడిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
వాస్తవానికి ఈ వీడియో ఫిబ్రవరి మూడో వారంలో రికార్డు చేసి ఉంటారని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. అందులో ఉన్నది తేజ్ బహదూరేనని, అతడి వద్దకు భార్య వెళ్లినప్పుడు ఈ వీడియో రికార్డు చేసి ఉండొచ్చని, విచారణ కోసం గతంలో అతడి వద్ద ఉన్న ఫోన్ను తీసుకున్నట్లు తెలిపారు. అతడి ఫేస్బుక్ పేజీలో కొంతమంది పాకిస్థాన్ స్నేహితులు ఉన్నట్లు గుర్తించామని, వారి ప్రభావం అతడిపైన పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more