భారత దేశాన్ని అవినీతి రహిత దేశంగా రూపోందించే క్రమంలో క్యాష్ లెస్ ఎకానీమినీ ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం.. త్వరలోనే దేశ ప్రజలకు శుభవార్తను అందించనుంది. డిజిటల్ పేమెంట్ ద్వారా లావాదేవీలు జరిపే ప్రజలకు డెబిట్ కార్డు సేవా ఛార్జీలు తగ్గించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు ప్రతిపాదనలు సిద్దం చేస్తుందని కేంద్ర అర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ భారతీయ సెంట్రల్ బ్యాంకుతో చర్చలు జరుపుతుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పాత పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయని అరుణ్ జైట్లీ తెలిపారు.
రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే డెబిట్ కార్డు లావాదేవీలకు మార్జినల్ డిస్కౌంట్ ఛార్జీలను(ఎండీఆర్) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని జైట్లీ తెలిపారు. ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న వెంటనే అవి అమల్లోకి వస్తాయన్నారు. కొత్త టెక్నాలజీస్ తో డిజిటల్ లావాదేవీలు మరింత చౌకగా లభ్యమవుతాయని, ఎక్కువ మంది ప్రజలు డిజిటల్ వైపు మరలుతారని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. డిజిటల్ మనీనే వాడాలని తమ అధికారులకు కూడా ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేయడం ముందస్తుగానే ప్రారంభించిందని, కానీ ఏటీఎం మిషన్లలోకి అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more