సరిహద్దులో మళ్లీ టెన్షన్.. ఉగ్ర కాల్పులు.. ముగ్గురు కార్మికుల మృతి | 3 GREF personnel martyred in terror attack in Akhnoor.

Terror attack on gref camp in akhnoor

Terror attack, Jammu kashmir, GREF camp, Akhnoor terror attack, GREF camp, GREF Camp terror attack, Terror attack on GREF camp, Pak Occupied Kasmir attack, Border Terror Attack

Terror attack on GREF camp in Akhnoor, 3 labourers killed..

ఉగ్రవాదులు రెచ్చిపోయారు .. ముగ్గురు కూలీల మృతి

Posted: 01/09/2017 10:30 AM IST
Terror attack on gref camp in akhnoor

సరిహద్దులో మరోసారి తుపాకీ మోతతో దద్దరిల్లింది. సోమవారం ఉదయం కశ్మీర్ లోని ఆఖ్నూర్ లోని జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్(జీఆర్ఈఎఫ్) క్యాంపుపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అక్కడ పని చేసే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. భద్రతాబలగాలే లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ దాడి ప్రారంభం అయ్యిందని, వెంటనే అలర్ట్ అయిన సైనికులు ఎదురు కాల్పులు ప్రారంభించారని ఓ అధికారి తెలిపాడు. ప్రస్తుతం భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖ్కూర్ సెక్టార్ లో హై అలర్ట్ ప్రకటించారు. బతాల్ గ్రామంలో తలదాచుకున్న ఉగ్రవాదులు... ఈ తెల్లవారుజామున ఆర్మీ క్యాంపుపై దాడికి తెగబడ్డారు.

కాగా, సర్జికల్ దాడుల తర్వాత భారత దళాల క్యాంపులపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 97 ఘటనలు జరగ్గా 146 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  Akhnoor sector  terror attack  

Other Articles