ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించగానే అందరి దృష్టి ముందుగా అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ పై పడింది. అయితే ఇప్పటికే ప్రజలనాడిని తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించిన సర్వే సంస్థలు కూడా షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తమ అంచనాల చిట్టాను విప్పాయి. గతంలో ఈ సర్వే సంస్థల అంచానాల మధ్య కొద్దిపాటి వ్యత్యాసం వుండేది. కానీ తాజాగా సర్వే సంస్థలు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ఓటర్లను అమోమయానికి గురిచేస్తున్నాయి. ఎక్కడ ఏమాత్రం పోంతన లేకుండా సర్వే సంస్థలు అంచానాల చిట్టాను విడుదల చేయడంతో ఇదెలా సాధ్యం అని ఓటర్లు విస్మయానికి గురవుతున్నారు.
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్ -లోక్నీత్ -సీఎస్డీఎస్ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం అధికార పార్టీయైన ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని, అఖిలేష్ పాలన మరో పర్యాయం కొనసాగవచ్చునని కూడా పేర్కొంది. రెండు సర్వే సంస్థలు విభిన్నమైన ఫలితాలను విడుదల చేయడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్ డిసెంబర్లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది.
అయితే ఏబీపీ న్యూస్-లోక్నీత్-సీఎస్డీఎస్ సర్వే ఉత్తరప్రదేశ్లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలను సంపాదించే అవకాశముందని అంచనా వేసింది. ముఖ్యమంత్రి అఖిలేష్ పాలన బాగుందని, ఈ పాటనను మరోమారు కొనసాగాలని ప్రజలు అశిస్తున్నారని పేర్కొంది. అధికార పార్టీ సమాజ్ వాదీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్కు 13-9 సీట్లు రావొచ్చునని తెలిపింది.
ఇక పంజాబ్ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు. ఏబీపీ న్యూస్-లోక్నీత్-సీఎస్డీఎస్ సర్వే పంజాబ్లో అధికార శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్ సర్వే మాత్రం కాంగ్రెస్-ఆప్ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్కు 49-55 సీట్లు, ఆప్కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more