ఓవైపు కొత్త ఏడాది సంబరాలకు అంతా ముస్తబు అవుతుంటే.. ఉగ్రదాడుల అలర్ట్ కలకలం రేపుతోంది. న్యూఇయర్ వేడుకల్లో టెర్రరిస్టులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. భారతదేశంపై ఏ క్షణమైనా ఉగ్రవాదులు భారీ ఎత్తున దాడులతో విరుచుకుపడవచ్చని, పశ్చిమ దేశాల నుంచి వెళుతున్న పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించింది.
కొత్త సంవత్సరం వేడుకలు, టూరిస్టులు లక్ష్యంగా ఈ దాడులు సాగవచ్చని, ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో దాడులు సాగే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేశామని ఇజ్రాయిల్ యాంటీ టెర్రరిజం డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. క్లబ్, బీచ్ పార్టీలకు ఇండియాలోని తమ దేశీయులు దూరంగా ఉండాలని, గోవా, పుణె, ముంబై, కొచ్చిన్ ప్రాంతాలు రిస్క్ లో ఉన్నాయని పేర్కొంది.
కాగా, ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎంతో మంది సైనికులకు ఇండియన్ ఆర్మీ గత కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.
రాత్రి 1 కాదు 2 గంటల దాకా...
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకునే వేడుకలకు హైదరాబాద్ పోలీసులు నిబంధనలు సడలించారు. అర్థరాత్రి ఒంటిగంట దాకా అనుమతించిన పోలీసులు, ఆపై దానిని 2 గంటల దాకా పొడిగించారు. ప్రతీయేడాది 1 గంటల దాకానే అనుమతి ఉండగా, ఈసారి వచ్చిన విజ్నప్తుల మేరకు గంట పొడిగించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతిగా ప్రవర్తిస్తే, జైలుకు వెళ్లాల్సి వుంటుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. యథావిధిగా అన్ని ఫ్లయ్ ఓవర్లనూ మూసివేస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుందని, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తుంటామని తెలిపారు. దాదాపు ఇదే విధమైన ఆంక్షలు విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ కొనసాగనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more