దేశం నుంచి అవినీతి, నల్లధనాన్ని పారద్రోలేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం పెద్దనోట్ల రద్దుతో పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని అరోపించారు. తాను మాట్లాడితే భూకంపాలు వస్తాయని రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో భాగంగా చట్టసభల అవరణలో చేసిన వ్యాఖ్యల అనంతరం.. అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద కూడా వున్నాయని అరోపించడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం పెద్దనోట్ల నిర్ణయాన్ని తొలినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. రాహుల్ గాంధీ తరువాత ప్రధాని మోదీపై ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని అరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద కూడా వున్నాయని అన్నారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, ప్రధాని అవినీతిపై తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా లక్నోలో నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నోట్ల రద్దు అంటే పరోక్షంగా బడాబాబుల బ్యాంకు రుణాలను రద్దు చేయడమేనని ఆరోపించారు. వారికి లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వానికి రైతుల రుణాలను రద్దు చేసేందుకు మాత్రం చేతులు రావడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక, పెద ప్రజల వ్యతిరేక ప్రభుత్వాన్ని అనుకూలంగా రానున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఆయన పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పేదవారిని కష్టాలకు గురిచేస్తూ.. బడాబాబులను మాత్రం అందలం ఎక్కిస్తున్న బీజేపికి మీరే బుద్ది చెప్పాలని ఆయన యూపీలోని లక్నోలో ఓటర్లను కోరారు. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి బిర్లా గ్రూప్ నుంచి భారీగా ముడుపులు అందాయని తేలిందన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ కేజ్రీవాల్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more