ఐరోపా దేశాలను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు తమ పంథాను మార్చుకుని అసియా దేశాలపైకి తమ దృష్టిని మరల్చారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను టార్గెట్ చేసుకుని బేకరిలోకి చోరబడి ఇద్దరిని పొట్టనబెట్టుకుని 60 మందిని తమ బందీలుగా చేసుకున్నారు. సరిగ్గా రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం రోజు ప్రార్థనలు ముగిసిన అనంతరం.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ముష్కరులు ఈ బేకరీలోకి చోరబడి దాడులకు తెగబడ్డారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ముష్కరులకు, పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
డాకలోలోని దౌత్యవేత్తలు అధికారులు, విదేశీయులు అధికంగా వచ్చే ప్రఖ్యాత హోలీ ఆర్టిజాన్ బేకరీలోకి తొమ్మిది మంది ఉగ్రవాదులు చోరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో పోలీసు ఉన్నతాధికారి సలావుద్దీన్ ఖాన్తోపాటు మరొకరు మృతి చెందగా.. ముపై అయిదు మంది గాయపడగా, అందులో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారని సమాచారం.
కాగా, బేకరీలో వున్న 60 మందిని ఉగ్రవాదులు తమ బందీలుగా చేసుకున్నారు. బందీలుగా ఉన్న వారిలో 20 మంది విదేశీయులున్నారు. బందీల్లో భారతీయులు కూడా ఉన్నారని తెలిసింది. నినాదాలు చేస్తూ ఉగ్రవాదులు స్వైర విహారం చేసినట్లు సమాచారం. అయితే బంగ్లా ప్రభుత్వం పరిస్థితి బాగానే ఉందని చెబుతోంది. రంజాన్ చివరి శుక్రవారం నాడు ఈ కాల్పులు జరగడంతో తీవ్ర భయాందోళనతో బంగ్లా ప్రజలు ఉక్కిరి బక్కిరిమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందోళనకు గురవుతున్నారు.
బేకరీలోకి దుండగులు ప్రవేశించగానే అక్కడ వంటపని చేసే కొందరు వ్యక్తులు పరుగులు తీసి ప్రాణాలు నిలుపుకున్నారు. ఉగ్రుల ఏకథాటి కాల్పులను బంగ్లా భద్రతా సిబ్బంది ఎదుర్కొనలేకపోయిందని సమాచారం. ఈ విషయాన్ని మాత్రం బంగ్లా సర్కార్ కొట్టిపారేస్తోంది. భారత్ దౌత్య కార్యాలయం కూడా కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉంది. ఇదిలా ఉగ్రవాదుల డిమాండ్స్ ఏంటో చెప్పాలని భద్రతా బలగాలు కోరాయి. వారితో చర్చించే అవకాశం ఉందని కొన్ని ప్రముఖ చానెల్స్లో వార్తలు వస్తున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more