నిజాయితీగా ఉండే నేతలకు ఎప్పుడూ కష్టాలే ఎదురవుతాయన్న దానికి నిదర్శనం ఇక్కడ చెప్పబోయే ఉదంతం. కక్ష్య సాధింపు చర్యతో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం రోడ్డుపైన పడింది. అది పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లా గర్హ్ శంకర్ పట్టణం. రోడ్ల పక్కన చాలా మంది గుఢారాలు వేసుకుని నివసిస్తున్నారు. అక్కడే టార్పాలిన్ టెంటు వేసుకుని ఓ కుటుంబం నివసిస్తోంది. అంత మందిలో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ ఇంటి యజమాని శింగార రాం షహుంగ్రా ఎమ్మెల్యేగా పనిచేశారు, అది కూడా రెండుసార్లు.
పంజాబ్ లో బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనను అతి పేద నేతగా అభివర్ణిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రముఖంగా ఓ కథనం ప్రచురించింది. రెండు పర్యాయాలు అధికారం చేతిలో ఉన్నప్పటికీ చిల్లి గవ్వ కూడా ఆయన వెనకేసుకోలేదంట. అంతేకాదు సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేని ఎమ్మెల్యే అంటూ అందులో పేర్కొంది. తాజాగా ఆయన ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్ ను పంజాబ్ సర్కారు ఖాళీ చేయించింది. ఆయన అందులో అక్రమంగా ఉంటున్నాడన్నది ప్రభుత్వ వాదన. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది.
‘‘నాకు ప్రభుత్వం నుంచి రూ. 20 వేలు పెన్షన్ వస్తోంది. ప్రస్తుతం ఓ అద్దె ఇంటి కోసం వెతుతుకున్నాను. అప్పటి వరకూ మాకు ఆకాశమే పైకప్పు" అంటూ శింగార రాం వ్యాఖ్యానించారు. బీఎస్పీ మహా నేత కన్షీరాం చివరి క్షణాల్లో ఆయన వెంట ఉన్నందుకు పార్టీ నుంచి ఆయన్ను తొలగించారు. అయితే ఆయన అక్రమంగా ఉంటున్నారనటానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు. నిజాయితీగా నిమ్న కులాల అభ్యున్నతికి కృషి చేయడమే తన తప్పై పోయిందని, ఏనాడూ తాను డబ్బు సంపాదించాలని భావించలేదని, అదే ఇప్పడు తన దుస్థితికి కారణమయిందటూ శిఖరాం వాపోతున్నాడు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more