అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీకి అయోధ్య వ్యవహారంలో మాత్రం తలనొప్పి తగ్గట్లేదు. ఏళ్ల తరబడి నాన్చుతూ వస్తున్న రామమందిర అంశంపై తాడో పేడో తేల్చాలని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా యూపీ ఎన్నికల్లో స్థానిక పార్టీలను కట్టడి చేసి భారీ విజయం సొంతం చేసుకుందామనుకుంటున్న ఆ పార్టీకి ఇప్పుడు ఈ అంశంలో మరో చిక్కు ఎదురైంది. అసలు రామమందిరాన్ని బాబర్ కూల్చలేదంటూ ఓ బాంబ్ పేల్చారు మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్.
‘అయోధ్య రీవిజిటెడ్’ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ఔరంగజేబు హయాంలో దానిని కూల్చివేశారని అంతా అనుకుంటున్నారు. కానీ, అది కూల్చి వేసింది అసలు బాబర్ అంటూ అందులో పేర్కొన్నాడు. ‘‘అయోధ్యలోని రామమందిరాన్ని కూల్చివేయమని బాబర్ ఎప్పుడూ ఆదేశించలేదు. నిజానికి ఆయనెప్పుడూ అయోధ్యను సందర్శించలేదు’’ అని పుస్తకంలో పేర్కొన్నారు.
‘‘బాబర్ నుంచి షాజహాన్ వరకు అందరు చక్రవర్తులు అన్ని మతాలపైనా ఉదారంగా ఉండేవారు. ఆ సమయంలో అయోధ్యలోని సాధుసంతులు ఎంతో ఆనందంగా జీవించేవారు. అవధ్ ప్రాంతంలోని నలుగురు నవాబుల హయాంలో మతసామరస్యం వెల్లివిరిసింది. అయితే ఔరంగజేబు వచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి’’ అని అందులో వివరించారు. ఆయన ఆదేశాలతోనే రామమందిరం కూల్చివేత జరిగిందని తన పుసక్తంలో తెలిపారు.
బీహార్ కు చెందిన కునాల్ 1972 గుజరాత్ కేడర్ అధికారి. ఈ పుస్తకం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. చరిత్రను తిరగేశారు. పురావస్తు శాఖనుంచి వివరాలు సేకరించారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి ముందు అక్కడ రామ జన్మభూమి ఆలయం ఉండేదన్న మాట వాస్తవం. అందరూ అనుకుంటున్నట్టు దీనిని 1528లో బాబర్ హయాంలో కూల్చివేయలేదు. 1660లో ఔరంగజేబు హయాంలో దాన్ని కూల్చివేశారు. అప్పట్లో ఫెదాయ్ ఖాన్ దానికి గవర్నర్ గా ఉన్నారని పుస్తకంలో కునాల్ వివరించారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more