తెలంగాణలో కాంగ్రెస్ కు భారీ షాక్ ఇస్తూ సీనియర్లు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ బ్రదర్స్, ఎమ్మెల్యే ఆనంద భాస్కరరావులు వీరితోపాటు ఏకైక సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ లు గులాబీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరిచ్చిన దెబ్బకి ఏకంగా ఢిల్లీ అధిష్ఠానమే ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి మరిన్ని జంప్ లను జరగకుండా చూడాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే తెలంగాణ భవన్ వేదికగా బుధవారం వీరంతా గులాబీ తీర్థం పుచ్చుకుంటుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న గుత్తా టీఆర్ఎస్ చేరికే చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా టీఆర్ఎస్ లో చేరిన కార్యకర్త స్థాయి నేతకైనా సరే గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ, ఆ సంప్రదాయానికి విరుద్ధంగా గుత్తా గులాబీ కండువా కప్పుకోకుండానే టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాకకు ముందే వేదిక మీదకు చేరిన గుత్తా అక్కడి కార్యకర్తలతో కలిసి హడావుడి చేశారు. ఇంతలో ఓ కార్యకర్త కండువా కప్పుకోవాల్సిందిగా గుత్తాకు సూచించగా, దానికి ఆయన నిరాకరించారు.
source from Inews
తర్వాత అక్కడకు వచ్చిన కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ పుష్ప గుచ్ఛం అందజేశారు. ఆపై వివేక్, వినోద్ లతో పాటు భాస్కరరావు, రవీంద్ర నాయక్ లకు పార్టీ కండువాలు కప్పిన కేసీఆర్... గుత్తా మెడలో పార్టీ కండువా వేయడాన్ని పూర్తిగా మరిచిపోయారు. ఇక గుత్తా కూడా ఈ విషయాన్ని లైట్ తీస్కుని వారితో ఫోటోలు దిగారు. అటు తర్వాత కేసీఆర్ ఉపన్యాసం ఇస్తున్నంత సేపు కూడా గుత్తా కండువాలేకుండానే కనిపించారు. పార్టీలో చేరిన కొత్తవారితో కలిసి కేసీఆర్ వేదిక మీదే ఫొటోలకు పోజిచ్చారు. కానీ, అన్ని ఫోటోలో కెల్లా అధ్యక్షుడు కేసీఆర్ తోసహా గుత్తా మెడలో కండువా లేకపోవటమే హైలెట్ గా నిలిచింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more