mudragada pabmanabham health condition detoriates as his hunger stirke reaches fifth day

Mudragada pabmanabham hunger strike reaches fifth day

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Kapu caste leader Mudragada padmanbham health condition detoriates as his hunger stirke reaches fifth day

ఐదో రోజుకు ముద్రగడ దీక్ష.. క్షీణించిన అరోగ్యం..

Posted: 06/13/2016 07:01 AM IST
Mudragada pabmanabham hunger strike reaches fifth day

కాపు కులస్థులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని, వారిపై అక్రమంగా బనాయించిన కేసులు, రౌడీషీట్లు తక్షణం ఎత్తివేయాలని, తుని రైలు దహనం ఘటనను సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను ఐదో రోజుకు చేరుకుంది. రాజమండ్రి అస్పత్రిలో ఆయన తన సతీమణి పద్మావతితో పాటు అమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తుండటం వల్ల ముద్రగడ అరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు.

ముద్రగడ తక్షణం వైద్య సాయం తీసుకోవాలని వారు తెలిపారు. అయితే బలవంతంగా ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించినా.. ఆయన దానిని తిప్పికోట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా.. ప్రభుత్వం దిగివచ్చి ఆయన డిమాండ్లను పరిశీలించడం లేదని కాపు వర్గీయుల్లో తీవ్ర అందోళన వ్యక్తమవుతుంది,  వైద్యానికి ముద్రగడ నిరాకరిస్తుండటంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఆదివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు.

వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే గాని ముద్రగడ ఆరోగ్యం ఎంతవరకు క్షీణించిందనేది చెప్పలేమని రాజమహేంద్రవరం వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ చెప్పారు. ముద్రగడ సతీమణి, కోడలికి బలంవంతంగా ఫ్లూరుుడ్స్ పెట్టగా, చిన్న కుమారుడు గిరి ఆమరణ దీక్షలోనే ఉన్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాపుల పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. మహిళలు, విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ‘చలో రాజమహేంద్రవరం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు నాడు ప్రకటించింది.

ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం చంద్రబాబుకు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ఉన్న కాపులు గట్టి షాక్ ఇచ్చారు. పలు గ్రామాల్లో టీడీపీకి కాపు నేతలు రాజీనామా చేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ ముద్రగడను కలిసేందుకు రాజమహేంద్రవరం రాగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి తిప్పి పంపేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందనే విషయం తెలుసుకున్న మేడిశెట్టి నూకరాజు అనే అభిమాని ఆదివారం రాత్రి మృతిచెందాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  hunger strike  hospital  

Other Articles