if police enters my house, will have pesticide warns mudragada

Will drink pesticide mudragada warns police

mudragada hunger strike, mudragada padmanabham, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Kapu caste leader Mudragada padmanbham, warns police not to enter his house, if police voilates will drink pesticide

దీక్షను భగ్నం చేస్తే.. పురుగుల మందే శరణ్యం.. మీడియాపై అంక్షలు..

Posted: 06/09/2016 11:07 AM IST
Will drink pesticide mudragada warns police

తుని ఘటనలో అరెస్టు చేసిన కాపు కులస్థులను తక్షణం విడుదల చేయాలని, అలాగే కాపులను బిసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ, తాను చేపట్టిన అమరణ నిరాహార దీక్షను భగ్నం చేయాలని పోలీసులు యత్నిసే తాను పురుగుల మందు(క్రిమి సంహారకం) సేవిస్తానని  కాపు ఉద్యమ నేత ముద్రగడ పధ్మనాభం పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. తన ఇంట్లోకి పోలీసులు వచ్చారో తక్షణం తాను క్రిమి సంహారక మందు సేవిస్తానని చెప్పారు. చేతిలో పురుగుల మందు పట్టుకుని దానిని పోలీసులకు చూపించారు.

పోలీసులు తన దీక్షను భగ్నం చేయాలని వస్తే.. తనకిదే శరణ్యమన్నారు. తాను అరెస్టుకు వెనుకాడటం లేదని, అయితే అమాలపురం పోలిస్ స్టేషన్ లో పోలీసుల విధులను అడ్డుకున్న కేసులో కాకుండా.. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం కేసులో తనను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా తన ఇంట్లోకి పోలీసులు చోచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తే తాను క్రిమిసంహారక మందు సేవించక తప్పదన్నారు.  కాపు జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు.

కాపుల రిజర్వేషన్లు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అరెస్ట్ అయ్యేందుకు తాను సిద్ధమే అని, అయితే అందుకు సరైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల అరెస్టులను తాను అడ్డుకోనని, ముందస్తు బెయిల్ కోసం తాను వెళ్లడం లేదని కూడా ఆయన చెప్పారు. తన ఇంటి వద్ద నుంచి పోలీసులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇవ్వడంతో, పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో ముద్రగడ అరెస్ట్ను పోలీసులు తాత్కాలికంగా విరమించుకున్నారు.

ఈ సందర్భంగా ముద్రగడతో పాటు దీక్షకు దిగిన ఆయన సతీమణి ఆందోళనకు గురై, కంటతడి పెట్టారు. ఆమెను ముద్రగడ ఏంకాదంటూ అనునయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముద్రగడ నిరాకరించారు.ఈ సందర్భంగా ఆయన తన సతీమణికి కూడా ధైర్యం చెప్పారు. కాపు కులస్థుల కోసం ఎలాంటి నిర్ణయానికైనా తెగించాల్సిందేనన్నారు. ఇంతలో మరో నేత అక్కడికి వచ్చి పురుగుల మందు ఎందుకంటూ ముద్రగడను సముదాయించే ప్రయత్నం చేయగా, ముద్రగడ పిరికి మాటలను నూరిపోయవద్దని సూచించారు. తన జాతీ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు తాను సిద్దమని చెప్పారు.

కాగా ముద్రగడ దీక్ష నేపథ్యంలో దానిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు అంక్షలు విదించారు. కొద్ది సేవటి క్రీతం ముద్రగడ నివాసం భయట కాపు సంఘాల నేతలతో వారి అభిప్రాయాలను సేకరిస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ నివాసం నుంచి బయటకు పంపించారు. ఇక తాజాగా మీడియాలో వస్తున్న ముద్రగడ లైవ్ కార్యక్రమాలను కూడా అడ్డుకున్నారు. మరోవైపు డీఐజీ రామకృష్ణ కిర్లంపూడి చేరుకున్నారు. మరోవైపు ముద్రగడ నివాసానికి కాపులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  chandrababu naidu  kapu leaders  hunger strike  pesticide  

Other Articles