తుని ఘటనలో అరెస్టు చేసిన కాపు కులస్థులను తక్షణం విడుదల చేయాలని, అలాగే కాపులను బిసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ, తాను చేపట్టిన అమరణ నిరాహార దీక్షను భగ్నం చేయాలని పోలీసులు యత్నిసే తాను పురుగుల మందు(క్రిమి సంహారకం) సేవిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పధ్మనాభం పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. తన ఇంట్లోకి పోలీసులు వచ్చారో తక్షణం తాను క్రిమి సంహారక మందు సేవిస్తానని చెప్పారు. చేతిలో పురుగుల మందు పట్టుకుని దానిని పోలీసులకు చూపించారు.
పోలీసులు తన దీక్షను భగ్నం చేయాలని వస్తే.. తనకిదే శరణ్యమన్నారు. తాను అరెస్టుకు వెనుకాడటం లేదని, అయితే అమాలపురం పోలిస్ స్టేషన్ లో పోలీసుల విధులను అడ్డుకున్న కేసులో కాకుండా.. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం కేసులో తనను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా తన ఇంట్లోకి పోలీసులు చోచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తే తాను క్రిమిసంహారక మందు సేవించక తప్పదన్నారు. కాపు జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు.
కాపుల రిజర్వేషన్లు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయ్యేందుకు తాను సిద్ధమే అని, అయితే అందుకు సరైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల అరెస్టులను తాను అడ్డుకోనని, ముందస్తు బెయిల్ కోసం తాను వెళ్లడం లేదని కూడా ఆయన చెప్పారు. తన ఇంటి వద్ద నుంచి పోలీసులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇవ్వడంతో, పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో ముద్రగడ అరెస్ట్ను పోలీసులు తాత్కాలికంగా విరమించుకున్నారు.
ఈ సందర్భంగా ముద్రగడతో పాటు దీక్షకు దిగిన ఆయన సతీమణి ఆందోళనకు గురై, కంటతడి పెట్టారు. ఆమెను ముద్రగడ ఏంకాదంటూ అనునయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముద్రగడ నిరాకరించారు.ఈ సందర్భంగా ఆయన తన సతీమణికి కూడా ధైర్యం చెప్పారు. కాపు కులస్థుల కోసం ఎలాంటి నిర్ణయానికైనా తెగించాల్సిందేనన్నారు. ఇంతలో మరో నేత అక్కడికి వచ్చి పురుగుల మందు ఎందుకంటూ ముద్రగడను సముదాయించే ప్రయత్నం చేయగా, ముద్రగడ పిరికి మాటలను నూరిపోయవద్దని సూచించారు. తన జాతీ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు తాను సిద్దమని చెప్పారు.
కాగా ముద్రగడ దీక్ష నేపథ్యంలో దానిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు అంక్షలు విదించారు. కొద్ది సేవటి క్రీతం ముద్రగడ నివాసం భయట కాపు సంఘాల నేతలతో వారి అభిప్రాయాలను సేకరిస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ నివాసం నుంచి బయటకు పంపించారు. ఇక తాజాగా మీడియాలో వస్తున్న ముద్రగడ లైవ్ కార్యక్రమాలను కూడా అడ్డుకున్నారు. మరోవైపు డీఐజీ రామకృష్ణ కిర్లంపూడి చేరుకున్నారు. మరోవైపు ముద్రగడ నివాసానికి కాపులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more