తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టంతా అమరావతిపైనే వుందని, తమ రాయలసీమ ప్రాంతాని అయన పక్కకు పెట్టారంటూ.. నిర్మోహమాటంగా తన మనస్సులోని భావనను బయటపెట్టిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మళ్లీ అదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి పార్టీ పరంగా ప్రాంతాల పరంగా కాకుండా తన శాఖ పరంగా ఆయన వ్యాఖ్యాలు చేశారు. తాను పర్యవేక్షిస్తున్న రెవెన్యూశాఖలోనే తన ఆదేశాలపై కూడా సక్రమంగా సమాధానాలు రావడంలేదని అసహనం వ్యక్తం చేశారు.
రెవెన్యూ శాఖలో అలసత్వం పెచ్చుమీరుతోందని, అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని లేని పక్షంలో ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎదుర్కొనక తప్పదని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి అర్జీలు పరిష్కారం కావడంలేదని, దీనిపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ల (జేసీల)తో సచివాలయంలో జరిగిన కాన్ఫరెన్సులో కేఈ మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో తాము ఎన్ని సంస్కరణలు తెచ్చినా కొందరి అలసత్వం వల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏడాది కాలంగా తాము 700 ఎండార్స్మెంట్లు జిల్లాలకు పంపితే 51కి మాత్రమే జవాబులు వచ్చాయి.. వాటిని కూడా పరిష్కరించలేదని కేవలం లెటర్లు మాత్రమే పంపించారని ఆయన మండిపడ్డారు. మేం పంపిన వాటికి కూడా ఏడాది దాటినా సమాధానం రాకపోతే ఎలా? ఒక స్వాతంత్య్ర సమరయోధుని భార్య విశాఖ జిల్లాలో 40 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఆమె ఎన్వోసీ కోసం దరఖాస్తు చేస్తే మన వాళ్లు అక్కడ చెట్లకు 40 ఏళ్లు లేవని రిపోర్టు ఇచ్చారు. ఆఫీసులో కూర్చుని రిపోర్టు ఇచ్చినట్లు ఉంది. చిత్తూరు జిల్లాలో వనజ అనే మహిళ.. భర్త, మామపై కేసు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె వస్తే తాను ఎండార్స్ చేయగా, దానికి రెండు నెలలుగా నాకు జవాబే లేదు. హైకోర్టు నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వడంలేదని అసహనం వ్యక్తం చేశారు
ఆర్డీవోలు, తహశీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏళ్లయినా అర్జీలు పరిష్కరించడంలేదని.. కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండి అని అధికారులే చెప్పడమేంటని, అయితే ఇక రెవెన్యూ శాఖలో అధికార యంత్రాంగం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టి జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతోందన్నారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం వెనుకాడదని కేఈ కృష్ణమూర్తి అధికార యంత్రాగాన్ని హెచ్చరించారు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more