తమ సినిమాల్లో నీతి, నిజాయితీ, ధర్మం, దానం లాంటి గోప్ప గుణాలున్న మనుషులు తప్పక విజయాలను అందుకుంటారన్న సందేశాలను చూపించే ప్రముఖ దర్శకులు.. వారి నిజ జీవితంలో మాత్రం వివాదాలకు కేంద్ర బింధువులుగా మారుతూ వార్తల్లో నిలుస్తున్నారు. లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేశారంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వివాదం రేపగా, ఆయన తమపై తనకు తెలిసిన పోలీసు ఉన్నతాధికారి సాయంతో అక్రమంగా కేసు బనాయించారని డిస్ట్రిబ్యూటర్లు మీడియా సమావేశంలో చెప్పడం.. ఈ వివాదం ఇంకా తెలుగు ప్రేక్షకులు మర్చిపోకముందే మరో ప్రముఖ దర్శకుడు తాజా వివాదంలో చిక్కకున్నారు.
ఈ సారి దర్శకుడు తేజ ఏకంగా క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. ఆర్.వి కృష్ణారావు అనే కలప వ్యాపారి తనకు దర్శకుడు తేజ నుంచి ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్శకుడు తేజతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదిన రాత్రి తన కారులో వెళ్తుండగా ఫిలింనగర్ సాయి ముక్తిథామం వద్ద విక్కి అనే వ్యక్తి తన కారు ఆపి వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నీపై దృష్టి పెట్టాయని హెచ్చరించాడని.. వ్యాపారి కృష్ణారావు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోన్నాడు.
తనకు, సినీ దర్శకుడు తేజకు మధ్యనున్న ఇంటి స్థలం అంశాన్ని సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసుకోవాలని, లేని పక్షంలో ప్రాణహానీ తప్పదని హెచ్చరించాడని బాధితుడు తన పిర్యాదులో పేర్కోన్నారు. మళ్లీ ఈ నెల 13వ తేదీన తేజ ఇదే విషయంపై కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కృష్ణారావు తనకు ఈ ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్శకుడు తేజతో పాటు వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక విక్కీ అనే వ్యక్తిని అన్వేషంచే పనిలో పోలీసులు వున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more