చాలా యాడ్ లలో కేవలం వెయ్య రూపాయిలకే ఈ ప్రొడక్ట్ అని వస్తుంటుంది. కింద మాత్రం కండీషన్స్ అప్లై అని ట్యాక్స్ లు అవీ ఇవీ అన్ని కలిపి తడిసి మోపెడవుతుంది. అయినా ఈ ఆఫర్ గొడవేంటి.. టైటిల్ లో మాత్రం ఏపి ఉద్యోగులు అని చెప్పి లోపట మాత్రం ఇదేంటి అనుకుంటున్నారా..? అదే చెబుతున్నా. ఎలాగైనా ఈ ఏడాది జూన్ నాటికి ఉద్యోగుల తరలింపు భాగంలో భాగంగా ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. అమరావతికి తరలివచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిదినాలు అంటోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉద్యోగుల తరలింపు నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి ఉద్యోగుల తరలింపు ఖరారైన నేపథ్యంలో ఈ నిర్ణయం ఉద్యోగులకు ఉగాది కానుకగా మారిందనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ పరిపాలన వచ్చే జూన్ 15 నుంచి జరిగేలా చేసేందుకు అవసరమైన తాత్కాలిక సచివాలయం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే భవనాల నిర్మాణం స్లాబ్ ప్రక్రియ దాక వచ్చింది. మే చివరికి మొత్తం నిర్మాణం పూర్తి చేసి జూన్1 నాటికి పరిపాలనకు సిద్ధం చేయడానికి వీలుగా పనులు శరవేగంగా చేస్తునారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలివచ్చే ఉద్యోగులకు వారానికి 5 పనిదినాలు మాత్రమే ఉండేలా మార్పు చేస్తునారు. దీంతో ఎక్కువ శాతం మంది తరలి వచ్చేందుకు ఆస్కారం కలిగింది. ఈ నిర్ణయంతో ఎక్కుమంది తమ కుటుంబాలు, పిల్లలు హైదరాబాద్లో ఉన్నా వారంలో 5 రోజులు పనిచేసి రెండు రోజులు హైదరాబాద్ వెళ్లి కుటుంబంతో గడిపే అవకాశం ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు ఉద్యోగులు మాత్రం ఇంతమంది ఒక్కసారిగా తరలి వెళ్ళడం వల్ల వచ్చే సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు, ఉద్యోగుల నివాస పరిస్థితులపై దృష్టిసారించారని కోరుతున్నారు. డీఏతోపాటు ఇతర కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం డీఏ తోపాటు 30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యోగులు. మరి వీటిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. దీంతోనైన ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి బాట పడతారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more