కేంద్ర మాజీమంత్రి ఎ. సాయి ప్రతాప్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన్ని టీడీపీలోకి పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. యూపీఏ హయాంలో సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి ఆరు సార్లు ఎంపీగా సాయి ప్రతాప్ విజయం సాధించారు. అయితే గతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.మిథున్ రెడ్డి చేతిలో సాయి ప్రతాప్ ఓటమి పాలైయ్యారు.
సాయి ప్రతాప్ టిడిపిలో చేరడం వైసిపి అధినేత జగన్కు గట్టి షాకేనని చెప్పవచ్చు. ఇప్పటికే సొంత ఇలాకా కడపలో సొంత పార్టీకి చెందిన నేతలు సైకిల్ ఎక్కారు. ఇప్పుడు సొంత జిల్లాకు చెందిన బలమైన నేత, కాంగ్రెస్ సీనియర్ నేత సాయి ప్రతాప్ చేరడం కూడా కడపలో జగన్కు ఝలక్ అని చెప్పవచ్చు. సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ కడప జిల్లాలో బలమైన నేత కావడం గమనార్హం. కడప జిల్లా రాజంపేట లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు పోటీ చేసిన సాయిప్రతాప్ ఆరుసార్లు విజయం సాధించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సాయిప్రతాప్ అత్యంత సన్నిహితుడిగా భావించేవారు. వైయస్ అనుచరుడుగానే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ఐదుసార్లు సుదీర్ఘకాలం పాటు ఎంపీగా కొనసాగిన సాయి ప్రతాప్.. వైయస్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలోని యూపీఏ కేబినెట్ లో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. రాజంపేట నియోజకవర్గ భౌగోళిక స్వరూపం నేపథ్యంలో ఇటు కడప జిల్లాలోనే కాక అటు చిత్తూరు జిల్లాలోనూ సాయిప్రతాప్కు మంచి పట్టుంది.
వైయస్ మరణానంతరం సాయిప్రతాప్ వైసీపీలో చేరడం ఖాయమన్న వాదన వినిపించింది. అయితే తన తండ్రి సమకాలీనుడైన సాయిప్రతాప్ను జగన్ అంతగా పట్టించుకోలేదంటారు. దీంతో, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన సీఎం రమేష్.. సాయి ప్రతాప్ను టిడిపిలోకి తీసుకురావడంలో చక్రం తిప్పారని తెలుస్తోంది. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగా పలు పదవులను అధిరోహించిన సాయిప్రతాప్.. వైఎస్ తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీలో చేరడంపై ఆయన అనుయాయువులు విమర్శలను గుప్పిస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more