నిత్యం నువ్వా నేనా అంటూ అధికార విపక్షాల ప్రసంగాలతో పలు అంశాలపై. ప్రజా సమస్యలపై దద్దరిల్లే అసెంబ్లీలో రాజేంద్రుడు నవ్వులు పూయించారు. తనదైన శైలిలో ప్రభుత్వ ఎన్నికల హామీలపై ఆయన సెటైర్లు వేశారు. అదేంటి అనుకుంటున్నారా..? ఈ రాజేంద్రుడు ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి. బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ పై ప్రసంగించిన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో నవ్వులు పూయించారు. సీరియస్ అంశాలపై కూడా ఆయన వ్యంగోక్తంగా విసిరిన సైటర్లు సభ్యులను నవ్వించాయి. తమపైనే జోకులు వేసినా.. టీడీపీ సభ్యులు కూడా నవ్వులను అపుకోలేకపోయారు.
ముందుగా 'నందోరాజా భవిష్యతి' కథను గుర్తుచేశారు. రైతు రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి, డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి.. ఇలా ప్రతి అంశానికీ అదే మంత్రం పఠిస్తున్నారన్నారు. అది ఏంటంటే, రాజు గారికి ఇద్దరు భార్యలున్నారని, చిన్నభార్య కొడుకు నందుడని అన్నారు. చిన్న భార్యకు ఊళ్లో అన్నిచోట్లా అప్పులేనని, వాటిని ఎప్పుడు తీరుస్తారంటే.. ఏదో ఒక రోజు నందుడు రాజు కాకపోతాడా, అప్పులన్నీ తీర్చకపోతానా అన్నారన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒకరోజు చినబాబు రాకపోతాడా.. రుణమాఫీ చేయకపోతామా, చినబాబు రాకపోతాడా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతామా అన్నట్లు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
అలాగే, చివర్లో ఒక దోమ కథ కూడా వినిపించారు. పిల్ల దోమ పుట్టిన తర్వాత తొలిసారి ప్రపంచంలోకి వెళ్లి ఒక రోజంతా తిరిగి వచ్చిందని.. వచ్చిన తర్వాత దాని తల్లి దోమ, తండ్రి దోమ కలిసి ప్రపంచం ఎలా ఉందని అడిగారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. దానికి పిల్ల దోమ.. ''నాకింత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మీరు ఇంతవరకు చెప్పనే లేదు, నేను బయటకు వెళ్లగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు'' అందని, మన ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more