ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తన విలాసాల కోసం వ్యాపారాలు అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోవడంపై ఆయనకు మద్దతుగా నిలిచిన నేతల, ప్రముఖలకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టులాంటివి. దేశంలోని ప్రజాధానాన్ని ఎగవేసినా.. ఆయన కర్ణాటక బిడ్డని, దేశం వదిలిపోడని ఒకరు, ఆయన ఉత్తమ వ్యాపారి అని మరోక నేత వెనకేసుకువచ్చిన నేపథ్యంలో ఆయన మాత్రం ఇప్పట్లో భారత్ కు వెళ్లలని తెగేసి చెప్పారు,
తనపై ఇప్పటికే ఓ నేరగాడన్న ముద్ర భారత్ లో పడిందని, అందువల్ల తాను తిరిగి భారత్ కు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నానని దేశాన్ని విడిచి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తెగేసి చెప్పాడు. ప్రస్తుతం లండన్ లో ఉన్న మాల్యా 'సండే గార్డియన్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై గత సంవత్సరం లుకౌట్ నోటీసు జారీ అయిందని. తానేమీ పారిపోలేదని. ఇప్పుడు తనన్నో క్రిమినల్ గా ఎందుకు చిత్రిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రుణాలు తీర్చలేకపోవడం వ్యాపారంలో భాగంమన్నారు.
అంతేకాదు బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పుడే, వాటికి రిస్క్ గురించి కూడా తెలుసునని, ఇప్పుడు తనను ఎగవేత దారుడని, అర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరించడం సమంజసం కాదన్నారు. తన సొంత వ్యాపారం నాశనమైందని అన్నారు. తనను ఓ విలన్ గా చూడొద్దని అన్నారు. మొత్తం విషయంలో పెద్ద బాధితుడిని తానేనని, తనకు ఇండియా వెళ్లాలని వున్నా, తన వాదన వినిపించేందుకు పారదర్శకమైన అవకాశం లభించదని భావిస్తున్నానని అన్నారు.
తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని స్పష్టం చేయలేనని సండే గార్డియన్ కు ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో తెలిపారు. యూకేలో సైతం తనను మీడియా వెంటాడుతోందని, తాను మీడియాతో మాట్లాడబోనని తెలిపారు. కాగా మాల్యా ఇక దేశంలోకి రాడని తమకు ముందుగానే తెలుసునని కాంగ్రెస్ విమర్శించింది. మాల్యాకు కవచంలా వున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఆయనను సరక్షితంగా దేశం తీరాలను దాటించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ అరోపించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more