హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. హిమాయత్ నగర్ లో డాక్టర్ల మధ్య ఫైరింగ్ ఘటన మరువక ముందే.. మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గన్ మెన్ ప్రభాకర్ చేతిలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే కారు డ్రైవర్ సయ్యద్ అక్బర్ మృతి చెందాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాల్పులు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే డ్రైవర్ సయ్యద్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడనే వాదన వినిపిస్తోంది. పోలీసులు విచారణలో భాగంగా ఎమ్మెల్యే గన్ మెన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హోల్డర్ చెరిగిపోవడంతో సరి చేసుకునే ప్రయత్నంలో అది మిస్ పైర్ అయిందని గన్ మెన్ చెబుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కథనాలు వేరుగా ఉన్నాయి. గన్ మెన్ వద్ద ఉండాల్సిన తుపాకీని డ్రైవర్ సయ్యద్ అక్బర్ హ్యాండిల్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడని అంటున్నారు. అయితే ప్రేమ విఫలం కావడంతో సయ్యద్ అక్బర్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మృతుడు సయ్యద్ అక్బర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దగ్గర పదేళ్లుగా కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఎంతో నమ్మకస్తుడిగా గుర్తింపు పొందాడు. అటు గన్ మెన్ ప్రభాకర్ కూడా మదన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నాడు. ఎంతో నమ్మకస్తుడు కూడా. కాగా మృతుడు సయ్యద్ ది మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ చౌదర్ పల్లి గ్రామం. సయ్యద్ అక్బర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ల స్టేట్ మెంట్ కూడా తీసుకున్నాక విచారణను మరింత ముమ్మరం చేయనున్నారు. ప్రస్తుతం అయితే దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా మిస్ ఫైర్ వల్లే సయ్యద్ చనిపోయాడని ఎమ్మెల్యే కూడా చెబుతున్నారు. అయితే ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు. దీని పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రతీకారమా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more